"పోలవరం" గిరిజనుల పాలిట శాపం
పోలవరం. అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు.
వందలాది గ్రామాల్లో గిరిజన సంస్కృతిని ధ్వంసం చేసే ప్రాజెక్టు.
అతిపెద్ద మానవ విధ్వాంసానికి కారణమవుతున్న ప్రాజెక్టు.
హక్కుల ,పర్యావరణ సంఘాలు అడ్డుకుంటున్నప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ఎటువంటి అనుమతులు లభించనప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ప్రత్యామ్నాయాలను సహితం పట్టించుకోకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత, విధ్వంసం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభ్వుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ముందుకు కదలడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలయ్యింది. ఉగ్ర గోదారి ఉప్పెనై వచ్చినా ఊళ్లు వదలని ఆదివాసులను గుప్పెడు మంది పెట్టుబడిదారుల స్వలాభం కోసం, పట్టాణాల అవసరాలకోసం బలిపశువులను చేస్తున్నారు. కరువు కరాల నృత్యం చేసిన ఆ ఆడవి మీద నమ్మకంతో అక్కడే ఉన్న వాళ్ళను అడవి నుంచి తరిమేస్తున్నారు. చెట్టును, పుట్టను నమ్ముకొని అడవితో పెనవేసుకున్న జీవితాలను చెల్లా చెదరుచేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ఈ కుట్ర వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ పథక రచన వెనుక రాజకీయ పార్టీల స్వప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధ్వంసం వెనుక అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విధ్వంసక ప్రాజెక్టు వెనుక చరిత్రను తెలుసుకుంటే తప్ప, జరగబోయే మానవ విధ్వంస మనకు అర్థం కాదు. ఆ కుట్రను తెలిపేందుకే ఈ కథనం.
పొలవరం ప్రాజెక్ట్ పై తమ అభిప్రాయం చెబుతున్న ముంపు గ్రామస్తులు
ఈ ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత, విధ్వంసం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభ్వుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ముందుకు కదలడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలయ్యింది. ఉగ్ర గోదారి ఉప్పెనై వచ్చినా ఊళ్లు వదలని ఆదివాసులను గుప్పెడు మంది పెట్టుబడిదారుల స్వలాభం కోసం, పట్టాణాల అవసరాలకోసం బలిపశువులను చేస్తున్నారు. కరువు కరాల నృత్యం చేసిన ఆ ఆడవి మీద నమ్మకంతో అక్కడే ఉన్న వాళ్ళను అడవి నుంచి తరిమేస్తున్నారు. చెట్టును, పుట్టను నమ్ముకొని అడవితో పెనవేసుకున్న జీవితాలను చెల్లా చెదరుచేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ఈ కుట్ర వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ పథక రచన వెనుక రాజకీయ పార్టీల స్వప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధ్వంసం వెనుక అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విధ్వంసక ప్రాజెక్టు వెనుక చరిత్రను తెలుసుకుంటే తప్ప, జరగబోయే మానవ విధ్వంస మనకు అర్థం కాదు. ఆ కుట్రను తెలిపేందుకే ఈ కథనం.
ప్రాజెక్ట్ చరిత్ర...
పోలవరానికి 70 ఏండ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనా కాలంలోనే పోలవరానికి బీజం పడింది. 1941లో దీవాన్ బహదూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీర్ ఈ ప్రాంతంలో సర్వే చేసి పొలవరం దగ్గర ప్రాజెక్టు కోసం రూపకల్పన చేశారు. వర్షాకాలంలో గోదావరి వరదంతా సముద్రం పాలవుతోందని, జనవరి నుండి ఎప్రిల్ వరకు రబీ పంటకు, ఇతర మెట్ట పంటలకు నీరు లేక గోదావరి జిల్లాల రైతులు ఇబ్బందుల పడుతున్నారని, ఈ సమస్యను అధికమించాలంటే పొలవరం అనివార్యమని భావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల 50 వేల ఎకరాలకు రెండు కాలాలలో నీళ్లు అందించడమే కాకుండా 40 మేగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చుని ప్రణాళిక రూపొందించాడు. పాపికొండల గుండా ప్రవహించిన గోదావరి బయటకు రాగానే పోవవరం వద్ద ప్రాజెక్టును నిర్మించవ్చని సలహా ఇచ్చాడు. ఇక్కడ నిర్మించే ప్రాజెక్టును సాధ్యమైనంత ఎత్తున నిర్మించాలని,అయితే భద్రాధిలోని రాముని పాదాల కన్నా ఎత్తులో ఉంటకూడదన్నాడు. అందుకే ఈ ప్రాజెక్టుకు 'రామపాదసాగర్' అని ఆయన నామకరణం చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్టు ఖర్చు 130 కోట్లని అంచనా వేశారు. ఆహార ధాన్యాల దిగుమతుల కోసం భారతదేశం ఇంతకన్నా ఎక్కువే విదేశాలు చెల్లిస్తుంది కాబట్టి, దీని నిర్మాణాన్ని పూర్తిచేస్తే దిగుమతులమీద ఆధారపడాల్సిన అవసరం లేదని నాటి పాలకులు భావించారు. అయితే ప్రాథమిక క్షేత్ర అధ్యయనాలు, సవివర అధ్యయనాలు, విదేశీ నిపుణుల సలహాలు సంప్రదింపులు అన్నీ పూర్తయినా అనేక కారణాల వల్ల ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.
ఇంజనీర్ ఉద్దండుడు కె.ఎల్ రావు ఈ ప్రాజెక్టు గురించి తన గ్రంధంలో చర్చించడంతో పాటు దీని నీళ్లను కృష్ణా బేసీన్ వరకు విస్తరించడం వలన అదనపు ఉపయోగం ఉంటుందని కొత్త ప్రణాళికను రూపొందించాడు. అయితే ఈ ప్రాజెక్టుకు,అమెరికాలోని కోలరాడో రాష్ట్రంలో పార్కర్ డ్యాంకు ఒకే పోలీక ఉందని, దీన్ని నిర్మించాలంటే ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సి ఉంటుందన్నాడు కె.ఎల్.రావు. ఇదే సమస్య అమెరికాకు వస్తే అక్కడి ఇంజనీర్లు దాన్ని అధిగమించారని, వాళ్ళ అనుభవంతో ఈ సమస్యలను అధికమించవచ్చని ఆయన సూచించాడు. బ్రిటీష్ హాయంలో బీజం పడినప్పటికీ స్వాతంత్య్రం వచ్చా కూడా చాలా తతంగం నడిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాల పైన, ముంపు గ్రామాల పైన, వారికి కల్పించాల్సిన పునరావాసం పైనా అనేక సెమినార్లు, సదస్సులు జరిగాయి. ఎందరో నిపుణులు పోలవరంపై తమ తమ అభిప్రాయాలకు అక్షర రూపం ఇచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక కూడా దాదాపు 20 ఏండ్ల ఈ ప్రత్యామ్నాయాలను పట్టించుకున్న వారు లేరు.
మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వంటి కారణాలు ఈ ప్రాజెక్టుకు ఆటంకంగా మారాయి. ఇదంతా కుదుట పడ్డాక రాష్ట్రంలో మళ్ళీ పోలవరంపై ఫైల్లు 1969లో కదిలాయి. 'రామపాద ప్రాజెక్టును' పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చారు. గోదావరి ట్రిబ్యూనల్ ముందు పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర పాలకులు ప్రస్తావించారు. 1970లో ప్రభుత్వం పోలవరంపై మళ్ళీ ఓ రిపోర్టును సిద్ధం చేసింది. అందులో 145 అడుగుల ఎత్తులో డ్యాం నిర్మాణం. రెండు కాల్వలు తొవ్వాలని పేర్కోంది. కానీ 1978లో పోలవరంపై మరో రీపోర్టును సిద్ధం చేసింది. అందులో ప్రాజెక్టు ఎత్తును 150 అడుగులుగా పేర్కొంది. ఆ ప్రాజెక్టు రీపోర్టును కేంద్ర జల సంఘానికి పంపింది. గోదావరి అంతరాష్ట్ర నది కావడం మూలంగా మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, కర్నాటకలతో కూడా ఆంధ్రప్రదేశ్ చర్చించాల్సి వచ్చింది ఫలితంగా 1978 ఆగస్టు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో 1979 జులై 11న మధ్యప్రదేశ్తో,1980 ఎప్రిల్ 2న ఓరిస్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు పనులు ముందుకు కదులుతున్న క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలలో మార్పులు జరగడం. నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలనకు ఎన్టీయార్ చరమగీతం పాడటంతో ప్రాజక్టు మళ్ళీ ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోయేందుకు నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించించింది. 1985లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరోక రిపోర్టు సిద్దం చేసింది. 1987లో ఈ రిపోర్టును కేంద్ర జలసంఘానికి పంపింది. కానీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దగా సహాకరించకపోవడంతో ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పోలవరం తెరమరుగైంది.
2004 అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ఫైల్ను మళ్ళీ కదిలించాడు.కానీ పొలవరం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైన, గిరిజనులు ఎంత వ్యతిరేకించిన, తెలంగాణ మేధావులు ప్రత్యామ్నాయాలు చూపించిన కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద పనులు మొదలుపెట్టింది. ఆ తర్వాత జరుగుతున్నదంతా నడుస్తున్న చరిత్రే.
ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం - ప్రభుత్వం చెబుతున్న కారణాలు:
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు. గోదావరి జలాలను కృష్ణా జలాలకు మళ్లీంచడం మరియు కృష్ణా, గోదావరి డెట్టాలకు భద్రత కల్పించే లక్ష్యాలతో భద్రాచలం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో, దవళేశ్వరానికి 42 కిలోమీటర్ల ఎగువన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దగ్గర ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నదిలో పోలవరం దగ్గర 150 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవల్లో ఆనకట్ట కట్టి దీని ద్వారా పోలవరం జలాశయంలో 194.5 టీఎంసీల జలాశయం నిల్వ చేయవచ్చునని చెబుతుంది. ఈ జలాశయం ఆధారంగా 940 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ కష్టాలను కూడా అధికమించవచ్చునని ప్రభుత్వం యోచన. ఈ ప్రాజెక్టుకు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలా గుండా 174 కిల్లో మీటర్ల కాల్వ తొవ్వడం ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో 3.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం పథకం. అంతే కాకుండా ఈ కాలువను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణ నదిలో కలపడం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణ జలాల్లో కలపడం ద్వారా రాయలసీమ జిల్లాలకు కూడా నీటిని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎడమ కాలువను తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకులం వరకు తవ్వడం వలన ఈ నాలుగు జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా కోస్తా కారిడార్లోని పరిశ్రమలకు నీరు, దారిపొడవున ఉన్న పట్టణాలకు, పల్లెలకు తాగునీరు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇది బహుళ ప్రయోజనాలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దీని వ్యయం కూడా దాదాపు 20 వేల కోట్ల రూపాలపైనే ఉంటుందని, ఈ నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రభుత్వం చెబుతోంది.
ముంపు బాధితుల గోడు:
పోలవరం ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా జలదీక్ష చేస్తున్న ఆదివాసులు
పొలవరం ప్రాజెక్టు కట్టడం వలన లబ్ది కన్నా నష్టమే ఎక్కువే జరుగుతుందని గిరిజన సంఘాలు, పర్యావరణ వేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుత అభివక్త రాష్ట్రంలో 280 గ్రామాలు, ఛత్తీస్ఘడ్లో 13 గ్రామాలు, ఒరిస్సాలో 7 గ్రామాలు ముంపుకు గురువుతాయని, వీటితో పాటు 3 లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారని, అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుక అమాయకులైన గిరిజనులను బలిపశువులను చేస్తున్నారని హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నారు. 20 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తిచేసినా దాని ద్వారా వచ్చే లాభం తక్కువే అంటున్నారు. ప్రాజెక్ట్ ముంపు ప్రాంతమంతా 5వ షెడ్యూల్ ఏరియాలో ఉంది. ముంపుకు గురయ్యేవాళ్ళంతా గిరిజనులు.ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలోని కొండలపై నివసించే కొండరెడ్ల ఆదివాసీ తెగ ఈ ముంపుతో కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాళ్లకు కంప్యాన్షేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ పాలసీ-2003 (ఆర్ అండ్ ఆర్) ఇవ్వాలన్నా వాళ్ళకు లాండ్ టూ లాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ టూ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే, అది ప్రాజెక్టు కానీ భూమి ఇవ్వాలి. జనరల్గా ఆర్అండ్ ఆర్ పాలసీ ప్రకారం 50 వేల కన్న ఎక్కువ మంది ముంపునకు గురవుతే అక్కడ ప్రాజెక్టు నిర్మించకూడదని పాలసీ చెబుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ను రద్దుచేసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ముంపు మండలాల్లో ఉన్న జనాభా
హక్కుల సంఘాలు, పర్యావరణవేత్తల అభ్యంతరం :
పోలవరం ప్రాజెక్టు వలన దాదాపుగా ఖమ్మం జిల్లాలోని గిరిజన సమాజమంతా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో నివశించే కోయలు, గుత్తికోయలు, కొండరెడ్లతోపాటు ఇతర చెంచు జాతులు హరించుకుపోయే ప్రమాదముందంటున్నారు. వీరికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వేష, కట్టుబాట్లు ఉన్నాయని, వీరు ప్రస్తుత సమాజానికి దూరంగా జీవిస్తున్నారు. వీరి ఆహార అలవాట్లు, జీవన శైలి మొత్తం అడవిపైనే ఆధారపడి ఉండటం వలన పోలవరం మూలంగా వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే కొండరెడ్లకు ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చినా కొండదిగి రాలేదని, చాలా మంది కొండ దిగి బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే తనవు చాలిస్తున్నారని, ఈ ప్రాజెక్టు వలన ముంపు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనితోపాటు ప్రసిద్ధ పర్యాక కేంద్రాలైన 'పాపికొండలు', పేరాంటాల పల్లి, భద్రాచలం మొదలైన ప్రాంతాలు నామరూపంలేకుండా పోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అతి త్వరలో అంతరించిపోయే జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. వీరిని కాపాడాల్సిన ప్రభుత్వాలే వీరిని హరిస్తున్నారు. అంతే కాకుండా ప్రాజెక్టును నిర్మించడం మూలంగా జలాశయం కింద విలువైన ఖనిజ సంపద మునిగిపోతుంది. అడవులు, అభయరణ్యాలు మునిగిపోతాయని ఇది జంతువుల హక్కులను కాలరాయడమే అవుతుందంటున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ప్రత్యామ్నాయాలను కూడా చూడాలని కేంద్ర పర్యావరణ,అటవుల చట్టం చెబుతున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోకుండా ఆదివాసులను బలిపెట్టెందుకు చట్టాలను సహితం తుంగలో తొక్కుతున్నారంటున్నారు. ఇది పర్యావరణ చట్టం -1986, అటవీ చట్టం-1980, పెసా (గిరిజనుల హక్కులకు సంబంధించి) చట్టాలను ఉల్లంఘించడమంటున్నారు.
పోలవరం ముంపు ప్రాంతంలోని కొండ రెడ్డి కుటుంబం
తెలంగాణ వాదుల అభ్యంతరాలు :
గోదావరి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో 78 శాతం ఉంటే, ఆంధ్రలో కేవలం 22 శాతం మాత్రమే ఉంది. 700 వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరిలో ఒక్క శ్రీరాం సాగర్ ప్రాజెక్టు తప్పా ఇంకేమి లేదు. ఇవ్వాళ వలసవాద ప్రభుత్వం పొలవరం దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి 80 టీఎంసీలను కృష్ణా నదిలోకి తరలించడం ఆ తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. (1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్) శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్ళు తరలించుకుపోయిన తరువాత అక్కడ కొరత ఏర్పడితే దాన్ని దుమ్ముగూడ ప్రాజెక్టు ద్వారా నాగర్జున సాగర్ లోకి నీళ్ళు తీసుకుపోయేందుకు రెండు ప్రాజెక్టులు కడుతున్నారు. తమ ప్రాంత ప్రయోజనాలకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలు శాశ్వతంగా కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోస్తాంధ్ర జిల్లాలకు, వలస కాలనీలకు నీళ్లు తరలించుకు పోవడానికి ఆదివాసులను బలిపశువులను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
తమ ప్రాంతపై అభిమానాన్ని చూపిస్తున్న పాలకులు ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు అందించేందుక తెలంగాణ ఇంజనీర్లు ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టును రూపొందిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలని అడ్డంకులు పెడుతుంది కానీ ఇక్కడేమో ఏ అనుమతులు లేకున్నా ఆగమేఘాలమీద నిర్మాణం చేపడుతున్నది విమర్శిస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిన తర్వాత కానీ ఆంధ్రకు తీసుకెళ్ళడానికి వీలు లేదు. దీనికి చట్టం, అంతర్జాతీయ నాయ్యసూత్రాలు ఒప్పుకోవంటున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్కు త్రాగునీళ్ళు అందించేందుకు సింగూరు జలాలను తరలించి ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చివేశారని చెబుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నగరం కృష్ణాబేసిన్లో ఉన్నది. దీనికి గోదావరి బేసీన్తో సంబంధం లేదు.ఇప్పటికే రెండు ఫెజ్లుగా కృష్ణా నీళ్లు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పుడు అది కాకుండా గోదావరి నీళ్లని రాయలసీమకు తరలించుకుపోయే కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మేధావులు, నిపుణుల అభ్యంతరం:
పోలవరం నిర్మాణం ప్రాంతంలో 200 అడుగుల లోతు వరకు కేవలం ఇసుక మేట మాత్రమే ఉంది. ఎలాంటి రాతి పొర లేకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థంకగా మారే ప్రమాదం ఉంది.అధికారుల లెక్కల ప్రకారం నిత్యం గోదావరిలో 43 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుంది. వరద ఉధృతి సమయంలో పోలవరం నీటి ప్రవాహం ఇంకా ఎక్కువుంటుంది. రెండు రోజుల భారీ వర్షాలకే తరచుగా 52 అడుగులకు నీరు చేరుతుంది. ఇక నిర్మాణం పూర్తవుతే తోదావరి 200 అడుగులకు మించి ప్రవహించే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ గేట్లు మూస్తే ఖమ్మం జిల్లా, గేట్లు తెరిస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు నీట మునిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు , ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది ''.జాతీయ ప్రాజెక్టు''గా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకముందే కాల్వలు తొవ్వి పెట్టడం. అంతరాష్ట నది నది జలాలు, పర్యావరణ అనుమతులు, ముంపు బాధితుల పునరావాసం ఇలా అనేక సమస్యలు పరిష్కారించాల్సి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
2005 లొ వచ్చిన వరదల్లో నీటమునిగిన భద్రాది రామాలయం
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు , ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది ''.జాతీయ ప్రాజెక్టు''గా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకముందే కాల్వలు తొవ్వి పెట్టడం. అంతరాష్ట నది నది జలాలు, పర్యావరణ అనుమతులు, ముంపు బాధితుల పునరావాసం ఇలా అనేక సమస్యలు పరిష్కారించాల్సి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పరిష్కారమార్గాలు:
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. నర్మదా నదిపై నిర్మించిన ప్రాజెక్టుపై కూడా దీర్ఘకాల ఆందోళనలు నడిచాయి. కోర్టులో కేసులు నడిచాయి. నర్మాదా వివాదంలో నాటి ప్రధాని ప్రత్యామ్నాయాన్ని చూసించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కానీ నేటి పాలకులు ఆమె పేరు పెట్టుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం లేదంటున్నారు. ప్రాజెక్టుల విషయంలో పరిష్కారాలు దొరకని సమస్యలే లేవని విశ్లేషకులు చెబుతున్నారు. పోలవరంపై అనేకమంది నిపుణులు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు నీటి పారుదల నిపుణులు అనేక పరిష్కారాలు చూపినప్పటికీ ప్రభుత్వం ప్రత్మామ్నాయాల గురించి ఆలోచించడం లేదు. ఎజెన్సీ ఏరియాలో గ్రామ సభల ద్వారా అనుమతి తీసుకొని ప్రాజెక్టును ప్రారంభించాలి. కానీ గ్రామ సభల అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్వాసితుల పరిహారం చెల్లించే విషయంలో పారదర్శకంగా ఉండటం లేదని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 26 గ్రామాలు ముంపుబారిన పడతాయని అంచనావేశారు. కానీ తీరా 7 గ్రామాల గిరిజనులకే కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. దేవరిగొంది అనే గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా నిర్వాసితుల ఇళ్లను కూడా తొలగించడం వివాదస్పదమైంది. ఇన్నాళ్లు అడవినే నమ్ముకుని బతుకుతున్న తమను కట్టుబట్టలతో వెళ్లగొడితే ఎలా బలకాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి ఇవ్వాల్సిన హక్కు పత్రాలు ఇవ్వకపోగా నీళ్లు కరెంట్ సరఫరా నిలిపివేసి నిర్వాసితులపట్ట నిర్ల్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు . విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దీని వెనుక పాలక వర్గాల స్వప్రయోజనం దాగుందంటున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)







No comments :
Post a Comment