వేసవిలో రాష్ర్టంలో, దేశంలో మంచినీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకోకపోవటం, వారి నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతున్నది. ప్రపంచంలో అత్యంత వర్షపాతంగల దేశాల్లో భారత దేశం ఒకటి. సాలీనా 1170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. అతితక్కువ వర్షపాతంగల అనతంపురం జిల్లాలోనే 600 మి.మీ ఉంటుంది. అమెరికాలో సాలీనా 200 మి.మీ. వర్షపాతం ఉంది. దీన్ని గమనిస్తే మనకు నీటి వనరులు ఎంత సమృద్ధిగా ఉన్నాయో అర్థమౌతుంది. వర్షపాతంలో 10 శాతం కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాము. దేశంలో ఉన్న అనేక జీవనదులతోపాటు, ఆంధ్రరాష్ర్టంలో గోదావరి, కృష్ణ,ప్రాణహిత, వంశధార, పెన్నా, తుంగభద్ర మొదలైన నదులతో పాటు చెరువులు, బావులు, వాగులు, కుంటలు లక్షల సంఖ్యలో ఉన్నాయి.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు, చెక్డ్యాముల ద్వారా నదుల్లో నీటిని నిల్వ చేయగలిగి ఉంటే రాష్ర్టంలో నీటి సమస్య ఉత్పన్నం అయేది కాదు. ఐదు సంవత్సరాలు గడచినా రాష్ట్రంలో పూర్తి అయిన జల యజ్ఞం ప్రాజెక్టుల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఒకప్పుడు చెరువుల ద్వారానే సేద్యపు విస్తీర్ణం పెరిగింది.1896లో చెరువుల క్రింద 4 వేల హెక్టార్లు సాగుకాగా 1906 నాటికి 55వేల, 1936 నాటికి మూడు లక్షల హెక్టార్లకు చెరువుల సేద్యం విస్తరించింది. పాలకులు చెరువులను నిర్లక్ష్యంచేసి భారీ నీటి పారుదల రంగం వైపు మొగ్గుచూపారు. దీనిద్వారా కూడా సాగు, మంచి నీరు అందించలేకపోయారు. 1958లో 48 లక్షల హెక్లార్లు చెరువుల కింద సాగుకాగా, 1979 నాటికి 39, 1990 నాటికి 28 లక్షల హెక్లార్లకు చెరువుల సాగుపడిపోయింది. ప్రస్తుతం రాష్ర్టంలో 79 వేల చెరువులున్నాయి. వీటిద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం మూడున్నర లక్షల ఎకరాలకుమించి సాగుకావటంలేదు. చెరువులను మరమ్మ తులుచేసి వర్షపు నీటిని వాటికి మళ్లించేచర్యలు పాలకులు తీసుకొని ఉంటే ముంపు నివారణతోపాటు గ్రామాల్లో సాగు, మంచి నీటి సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేది. వేసవి నీటి ఎద్దడి తగ్గేది.
సాగునీటికి, మంచినీటికి భూగర్భ జలాలపై ఆధారపడడం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ర్టంలో 22 లక్షల 23 వేల బావులున్నాయి. రాష్ర్టంలోని భూగర్భ జలాల్లో 42 శాతం మాత్రమే ఉపయోగించుకొంటున్నాము. వర్షపు నీటి ఇంకుడుపై భూగర్భ జలాల నీటిమట్టం ఆధారపడి ఉంటుంది. బావుల క్రింద సాగయ్యే భూమి విస్తీర్ణం 10 లక్షల నుండి 26.44 లక్షల హెక్లార్లకు పెరిగింది. ఒక్కో బావి కింద సాగయ్యే సగటు విస్తీర్ణం 1.22 ఎకరాలనుండి 1.19 ఎకరాలకు పడిపోయింది. బావుల నుండి నీటి లభ్యత తగుగ్గతోందని ఇది తెలియజేస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టంలో బావుల సంఖ్య పెరుగుతున్నది. అందువల్ల బావుల సేద్యం పెరిగి భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోతున్నది. భూగర్భ జలాలను 90 శాతం వరకు గ్రామీణ ప్రజలు మంచినీటికి ఉపయోగిస్తున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రతి గ్రామంలో ఇంటిముందు చేతిపంపు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చేతి పంపులు ఉన్న గ్రామాల్లో వేసవిలో కూడా మంచినీటికి ఎద్దడి ఉండదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బావుల నీటిని మంచినీరుగా వాడుతున్నారు. వ్యవసాయ పంటల్లో వస్తున్న మార్నుల వలన వరి తర్వాత మినుము, పెసర స్థానంలో మొక్కజొన్న, జొన్న పంటల్ని గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ పంటల తరుణంలో కాల్వలకు నీరు విడుదల కాకపోవటంతో బోర్లద్వారా నీరు పైరుకు మళ్లించటం వలన గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం పడిపోయి, చేతిపంపుల నుండి నీరు రావడం తగ్గిపోయింది. ఫలితంగా ఈ కాలంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు.
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై పాలకులు సంతకం చేయడంతో దేశ వనరులన్నీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల కైంకర్యం అవుతున్నాయి. ఇందుకు ప్రపంచబ్యాంక్ చోదకశక్తిగా పనిచేస్తున్నది. ప్రకృతి సిద్ధమైన అన్ని వనరులతోపాటు నీటిని కూడా బహుళజాతి సంస్థలు వ్యాపార సరకుగా మార్చాయి. అందుకు అనుగుణమైన విధానాలు అనుసరించేవిధంగా పాలకులపై ప్రపంచబ్యాంక్ ఒత్తిడి చేసింది. మంచినీరు, సాగునీరు అందించే బాధ్యత నుండి రాష్ర్ట ప్రభుత్వం తప్పుకోవాలని, అందుకు సాగునీటిరంగంలో సంస్కరణలు చేపట్టా లని, అలాచేస్తేనే సాగర్, కృష్ణ డెల్టాల ఆధునికీ కరణకు, చెరువుల మరమత్తులకు అప్పుఇస్తామని ప్రపంచబ్యాంక్ చెప్పిన విధంగా, రెగ్యులేటరీ ఆధారిటీ ఏర్పాటుచేసింది. కాల్వలకు ఎంత నీరు విడుదల చేయాలి, నీటి పన్ను ఎంత వసూలుచేయాలి అన్నది ఈ ఆధారటీ నిర్ణయిస్తుంది. దీని అమలుకోసం రైతు సంఘాల ను ఏర్పాటు చేసింది. మీటర్లద్వారా అందే సాగునీటి పరిమాణం ప్రకారం రైతుసంఘాలు నీటితీరువా వసూలు చేస్తాయి. ఇది రైతాం గానికి ఆర్థికంగా పెనుభారంగా తయారౌ తుంది. నీటి పొదుపు పేరుతో- ఉన్న నీటినే అదనపు సాగుకు మళ్లించి అదనపు ఆదాయాన్ని రాబట్టడానికే నీటిమీటర్ల ఏర్పాటు.ఆచరణలో ఇది సాగు నీరు భూస్వాములకు- అన్న రూపం తీసుకుంటుంది. చిన్న, సన్నకారు రైతాంగం సాగుకి దూరంకావాల్సి వస్తుంది. ఈ విధంగా సాగునీటిని వ్యాపార సరకుగా ప్రపంచబ్యాంక్ చేయించింది.
సాగునీటికి ముందే మంచినీరు వ్యాపారంగా మారింది. మంచినీటి వ్యాపారం సామ్రాజ్య వాద బహుళజాతి సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూర్చిపెడుతున్నది. నదీ జలాలను, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలు అప్పనంగా వాడుకొంటు న్నాయి. రాజస్థాన్ లో కోకాకోలా కంపెనీ 14 పైసలకు వెయ్యిలీటర్ల చొప్పున లక్షల లీటర్ల నీటిని వాడుకొం టున్నది. ఇదే విధంగా అనేక రాష్ట్రాల్లో బహుళజాతి సంస్థలు నీటిని కొల్లగొడుతున్నాయి. మన దేశంలో ‘కిన్లే’ బ్రాండ్ వాటర్ లీటర్ ఖర్చు 25 పైసలు. నీటి ఖర్చుతో పాటు బాటిల్, బాటిల్స్ పెట్టే ప్లాస్టిక్ కార్బన్తో సహా రూ. 2.50 నుండి రూ. 3.75 కు మించదు. కానీ లీటర్ బాటిల్ను రూ. 20కి అమ్ముతున్నారు. పన్నులు పోను కంపెనీకి 50 శాతం నికరలాభం వస్తుంది. 2002లో భాత దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగింది. 1999-2004 మధ్య ప్రతి సంవత్సరం 25 శాతం చొప్పున ఈ వ్యాపారం పెరిగింది. భారతదేశంలో నీటిని శుద్ధిచేసి అమ్మేసంస్థలు వెయ్యి ఉన్నాయి. పార్లే బిస్లరీ 40 శాతం వ్యాపారాన్ని అక్రమించు కోగా, కోకోకోలాకు చెందిన ‘కిన్లే’ బ్రాండు 25 శాతం, పెప్సీకోలాకు చెందిన ఆక్వాఫేనా 10 శాతం వాటాలు పొందగా, మిగతా 25 శాతాన్ని దేశీయ వ్యాపారసంస్థలు పొందుతున్నాయి. ప్రపంచ వ్యాపి తంగా ప్రతి సంవత్సరం రూ. 30 లక్షల కోట్ల నీటి వ్యాపారం జరుగు తున్నది. అత్యధిక ధనిక కార్పొరేట్ సంస్థలు ప్రపచంలో ఐదువం దలు ఉంటే, నీటి వ్యాపారం చేసే సంస్థలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. ప్రపంచలో ఐదుశాతం మంది ప్రజలు బాటిల్ నీళ్ళను తాగిేత సంవత్సరానికి రూ. 50 లక్షల కోట్ల నీటి వ్యాపారం చేయవ చ్చని మవుదే బార్లే అనే నీటి ఉద్యమ కార్యకర్త బ్లూగోల్డ్ పుస్తకంలో తెలియచేసినట్లు ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. దీన్ని గమనిస్తే నీటి వ్యాపారం ఎంత పెద్దఎత్తున జరుగుతుందో అర్థమౌతుంది.
ప్రజలు సురక్షితమైన నీటిని కోరుకొంటున్నారు. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థపదార్థాలు, కాలుష్య రసాయనాలు ఆ ప్రాంతాల నీటిని కలుషితం చేస్తుండటంతో ఆ నీరు అనారోగ్య కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్ళ నీటి గురించి బహుళజాతి సంస్థలు చేసే ప్రచారానికి ప్రజలు ఆకర్షితులై, బాటిళ్ళ నీళ్లు ఆరోగ్యకరమైనవిగా భావించి, ఆ నీటికి అలవాటుపడుతున్నారు. మాములు ఫిల్టర్ పంపునీళ్ళకన్నా బాటిళ్ళ నీళ్ళే కలుషితమైనవని అనేక పరిశోధనల్లో వెల్లడి అయింది. బాటిళ్ళ నీళ్ళకన్నా, ఫిల్టర్ చేతిపంపు నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నారన్న వాస్తవాన్ని బహుళజాతి సంస్థలు మభ్యపరుస్తున్నాయి.నీటిని శుద్ధిచేసుకోవటం మన ప్రజలకు ఎప్పటినుండో తెలుసు. చిల్లగింజ గుజ్జు, పసటికమేసి ఎంతో పరిశుభ్రమైన నీటిని తాగేవారు. నీటివ్యాపారానికి మనదేశం లో ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రపంచబ్యాంక్ అనేక నివేదికలు విడుదల చేస్తున్నది. ‘డీప్ వెల్స్ ప్రూడెవ్’ పేరుతో ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదికలో మనదేశంలో భూగర్భ జలాలలభ్యత, వినియోగం, భవిష్యత్తు పరిణామాల గురించి విశ్లేషిం చింది. దేశంలో భూగర్భజలాలను ఎలా వినియోగించుకోవాలో బ్యాంక్ శాసించనున్నది. నీటి పొదుపుకోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకులకు సూచనలు పంపింది.60 శాతం వ్యవసాయ అవసరాలను, 85 మంచినీటి అవసరాలను దేశంలో భూగర్భజలాలే తీరుస్తున్నాయి.
ఈ విధంగా భూగర్భజలాల వినియో గాన్ని బ్యాంక్ కోరుకోవటంలేదు. అందుకే వినియోగంపై పాలకులపై ఆంక్షలు విధింపచూస్తున్నది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగిస్తే మరో 20సంవత్సరాల్లో ప్రమాదపరిస్థితి ఏర్పడుతుంద ని నివేదికలో పేర్కొంటూ, అలాంటి పరిస్థితిరాకుండా నియంత్రణ కమిషన్ ఏర్పాటుచేయాలని చెబుతూనే, దేశంలో రెండుకోట్లదాకా బావులు ఉన్నాయని, వాటిని నియంత్రణా వ్యవస్థలోకి తీసుకొని రావడంకష్టమని, అందువల్ల మంచినీటికి ధర నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. అందుకు అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం రూ.2కే బాటిళ్ళద్వారా మంచినీరు గ్రామాల్లో అందచేసా ్తననిచెప్పడం. దీనిద్వారా నీటివ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. మొత్తం పరిస్థితిని గమనించినపడు మంచినీటి కొరతకు పాలకులే కారణం అన్న విషయం స్పష్టమౌతున్నది. ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాన్ని వెంటనే విరమించు కోవాలి. ఇటువంటి ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రజలు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. దేశంలో బహుళజాతి సంస్థల నీటివ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలి.
5-2-13
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment