సంక్షోభం నుంచి గట్టేక్కెందుకే పాక్ దాడులు

No comments

జనవరి 8 అర్థరాత్రి సరిహ ద్దు దాటుకొని వచ్చి న పాక్‌ సైనికులు ఇద్దరు భారత సైని కుల తలల్ని తెగనరకడంతో ఇరుదేశాల మధ్య ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇటీవల కొన్ని రోజులుగా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రవాణా వాహనాలకు అనుమతులు నిరాకరించడంతో ప్రజలకు నిత్యావసర ఆహార వస్తువులు అందక అష్టకష్టాలు పడ్డారు. ఒకవైపు దేశం అంతర్గత సంక్షోభంలో చిక్కుకొని, నిత్యం ఏదో ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులకు వందలాదిమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, దాయది దేశం పాక్‌ మాత్రం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్నేహ హస్తం అందిస్తూ భారత్‌ ముందుకొస్తుంటే ఆ చేయ్యినే నరికేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. పాక్‌ క్రూరచర్యలకు నిరసనగా దేశవ్యాపితంగా ప్రజానికం పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూంటే, వీర సైనికులు లాన్స్‌ నాయక్‌ హేమరార్‌, సుధాకర్‌ల కుటుంబాలు తమ వారిని పొట్టన పెట్టుకున్న పాక్‌ సైనికులకు తగిన బుద్ధి చెప్పాలని, అదే తమ సభ్యులకు భారత సైనికులు ఇచ్చే నివాళి అని భావిస్తున్నారు.

కవ్వించి, హద్దుమీరి క్రూరమృగాల్లా- ఇద్దరు భారత జవాన్లను హతమార్చి, తలలు తీసుకెళ్ళిన పాక్‌ వైఖరిని చూస్తూ ఊరుకోకూడదని, ఆ దేశంతో తక్షణం చర్చలు ఆపివేసి ప్రతికారం తీర్చుకొని తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. పాక్‌ సైనికుల కుట్రలకు దేశంలోనే కాదు, ప్రపంచ  వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, పాక్‌ మాత్రం తన భూభాగంలోని స్థావరంపై దాడికి పాల్పడి ఒక సైనికున్ని కాల్చి చంపారంటూ దొంగ నాటకం ఆడింది. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని, తమపై అనుమానం ఉంటే థర్డ్‌  పార్టీతో ఎంక్వయిరీ జరిపించుకోండని ఉచిత సలహా పారేసింది. ఒక వైపు కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పాక్‌నేతలు బుకాయిస్తున్న సందర్భంలోనే వారి సైన్యం మరింత బరితెగించి జమ్మూ- కాశ్మీర్‌లోని పూంచ్‌, బట్టాల్‌ స్థావరాలపై విరుచుకపడింది. మరోవైపు చాకందాలోని పాక్‌ ఇండియా గేట్‌వేను పాక్‌ మూసేసింది. వందలాది సరుకు రవాణా వాహనాలను రాకుండా పాక్‌ అడ్డుకుంది. మొత్తానికి ఈ చర్యలను బట్టి, పాక్‌ కయ్యానికి కాలుదువ్వుతున్నదన్న వాదనలు బలపడుతున్నాయి.

పాకిస్థాన్‌ రాజకీయ సంక్షోభంలో చిక్కుకొని ఉంది. సగటు పౌరుడు అభద్రతా భావంతో ఉన్నాడు. పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను మరోవైపు ఉగ్రవాద దాడులు పట్టిపీడిస్తున్నాయి. సైన్యానికి, ప్రభుత్వానికి నిరంతరం సంఘర్షణ! ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా వారిని నిలవరించలేని నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్‌ మిగిలి పోతోంది. సైన్యం, ఐఎస్‌ఐల మధ్య ప్రభుత్వాలు నగిలిపోతున్నాయి. ఈ పరిణామాలకుతోడు మార్చిలో పాక్‌ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగను న్నాయి. స్వదేశంలో పాకిస్థాన్‌ ఏం చెయ్యలేక ప్రజల దృష్టిని మళ్లించేం దుకే భారత్‌పై దాడులకు పాల్పడు తోంది. భారత్‌పై తాము పోరాడుతు న్నామనే సంకేతాలు పంపేందుకే పాక్‌ పాలకులు పనిగట్టుకొని ఇలాంటిదాడు లను ప్రొత్సహిస్తున్నారు. పాలకులు, సైన్యం, ఐఎస్‌ఐ- మధ్య ముడుముక్కలుగా మారిన ప్రజాస్వా మ్యం ఆ దేశానికి పెను సవాళ్ళు విసరుతోంది. అవినీతిపై ప్రజా ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించి పాలకుల పుట్టి ముంచుతోంది.

అవినీతి ఆరోపణలకు ప్రధానిని అరెస్టు చేయాలని సుప్రీం ఆదేశించిందంటే అది సంక్షోభానికి సూచనే అని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇంట గెలవలేని పాకిస్థాన్‌ సరిహద్దుల్లో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఈ ఎత్తుగడలకు పాల్పడుతోంది. నిజానికి పాక్‌ ఇలాంటి కవ్వింపు ఘటనలకు పాల్పడడం కొత్త కాదు. దేశ విభజన నాటినుంచీ పాక్‌ వైఖరే ఇంత! ప్రపంచంమొత్తం వేలేత్తి చూపించినా తన బుద్ధి చూపిం చుకుంటూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తేలినా అఫిజ్‌ సయ్యద్‌ నుంచి దావుద్‌ ఇబ్రహీం దాకా అందరిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన చరిత్ర పాక్‌ది. భారత్‌తో శాంతి సంబం ధాలు కొరుకొంటున్నామనే నీతులు చెబుతూనే సరిహద్దుల్లో గుంటనక్కల్లా గోతులు తవ్వుతోంది. మూడు సార్లు భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నా బుద్ధి తెచ్చుకోలేని పాక్‌ మరోసారి కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధపడుతోంది. పాక్‌ దొంగనాటకాల గురించి భారత్‌ కన్నా ఇంకేదేశం రుచిచూసి ఉండకపోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈమధ్య కయ్యానికి కాలుదువ్వుతోంది పాక్‌ సైన్యం. కేంద్ర ఇంటలిజెన్స్‌ అనుమానం వ్యక్తం చేసినట్లు ఈ దూకుడు వెనుక బలీయమైన రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.

12ఏళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందంపై రెండుదేశాలు సంతకాలు చేసినప్పటినుంచి భారత్‌ తన పరిధిని ఏనాడూ దాటలేదు. ఈ 12 సంవత్సరాల కాలంలో పాక్‌ అనేక మార్లు కవ్వింపులకు పాల్పడి, యుద్ధానికి కాలుదువ్వినా, మన దేశం ఎన్నో సార్లు స్నేహహస్తం అందిస్తూ పాక్‌తో మైత్రికి చెయ్యిచాచింది. 2001 డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందంతో నమ్మకమైన మైత్రి కోసం భారత్‌ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. భారత్‌ చర్యలతో ఇటు నేలపై, అటు నింగిలో ఉన్న ఆంక్షలన్నీ రద్దయ్యాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. కానీ పాక్‌ మాత్రం కడుపులో కత్తులు నూరుతూ ముఖంపై నవ్వులు పులుముకుంది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితిమెరుగు పడుతున్నదని అందరూ సంబర పడుతున్న దశలో 2008లో ముంబైైలో బాంబ్‌ పేలుళ్ళు జరిగాయి. ఈ ఘోర కలి పాక్‌ చొరవతోనే జరిగిందన్నది జగమె రిగిన సత్యం. దానికిసజీవసాక్ష్యంగా కసబ్‌ను చూపించినా, ఆ కసాయితో తమకేసంబంధం లేదని బుకాయించింది. ఇక సరిహద్దుల్లో హద్దులు మీరడం పాక్‌ సైనికులకు కొత్తకాదు.

2009లో 28 సార్లు అక్రమ చొరబాట్లు నమోదయ్యాయి. 2010లో అది 44 సార్లకు చేరింది. గత ఏడాది వాటి సంఖ్య 117కి పెరిగింది. ఇదంతా పాక్‌ ప్రభుత్వ కవ్వింపు చర్యల్లో భాగమేఅని అందరికి తెలుసు. మూడు సార్లు భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ తోకముడిచినా తరచూ చొరబాట్లకు పాల్పడుతూ తలనొప్పులు సృష్టిస్తూ నియంత్రణ రేఖను అతిక్రమిస్తూనే ఉంది. ఇంతకీ పాక్‌ తరచూ ఇటువంటి పనికి పాల్పడడానికి కారణాలేమిటి అనేది ఆలోచిస్తే ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. జమ్మూ- కాశ్మీర్‌ భారత్‌కు కీలకమైన ప్రాంతం. పాక్‌ కోరుకుంటున్న ప్రాంతం కూడా ఇదే. ఈప్రాంతలోని మెజారిటీ ప్రజలు తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని పాక్‌ వాదిస్తూ దశాబ్దాలుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 1947లో రెండు దేశాలకు స్వాతంత్య్రాన్ని సాధించి, అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న కాలంలో కాశ్మీర్‌ రాజ్యం కోసం పోరు మొదలయ్యింది. దేశ విభజన సమయంలో నాటి పాలకులు సంస్థానాలకు ఒక వెసులుబాటు కల్పించారు. తమకు ఇష్టమైతే ఏ దేశంతోనైనా కలిసేందుకు వారికి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు. కానీ కాశ్మీర్‌రాజు హరిసింగ్‌ స్వతంత్రం గా ఉండాలని నిర్ణయించు కున్నాడు.

కానీ పాకిస్థాన్‌ దురాక్రమణకు దిగడంతో చివరి క్షణంలో రాజు హరిసింగ్‌ భారత్‌ తో ఒప్పందం చేసుకొ ని కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భారత్‌ పాక్‌ సైన్యాన్ని తరిమికొట్టింది. పాక్‌ స్వంత భూభాగంలో లాహోర్‌ను దాటిపో యింది. భారత విజయం ఖాయమైన చివరి క్షణంలో అనుహ్యంగా నాటిప్రధాని నెహ్రు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాడు. ఆయన నిర్ణయం సరైనదా కాదా అన్నదానిపై భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్‌ ఆక్రమించిన కాశ్మీర్‌ భూభాగాన్ని వదిలేసి భారత్‌ ఏకపక్షంగా వెనక్కి తగ్గింది. చేతులారా పాక్‌ జుట్టును వదిలేసినట్లయింది. చివరికి యుద్ధంలో భారత్‌ గెలిచి కూడా ఓడినట్లయింది. 1948 డిసెంబర్‌ 31న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పుడే నియంత్రణ రేఖను నిర్ధారించుకున్నాయి. 1965 ఆగస్టు 5న పాక్‌ మరోసారి కాశ్మీర్‌ కోసం యుద్ధానికి కాలుదువ్వింది. భారత బలాన్ని, బలగా న్ని ఆంచనా వేయలేక తోక ముడిచింది. కేవలం 20 రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలోను ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొంది కానీ నియంత్రణ రేఖను సరిగ్గా నిర్ధారించలేక పోయింది.

1999 మేలో కార్గిల్‌ యుద్ధం మొదలైంది. కాశ్మీర్‌ ఆక్రమణ కోసం మరోసారి ప్రయత్నించి పాక్‌ చేతులు కాల్చుకుంది. ఆసియాలో అణుబాంబు కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధంగా ఇది చరిత్ర కెక్కింది. ‘లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ను దాటి పాక్‌ చొరబాటుదారులు భారత్‌లోకి చొచ్చు కొచ్చారు. లడక్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్‌ ప్రయత్నించింది. దాంతో యుద్ధం తప్పనిసరైంది. జర్నల్‌ పర్వేజ్‌ ముషారప్‌ అత్యుత్సాహంతో జరిగిన ఆ యుద్ధంలో పాక్‌కు అంతర్జాతీ యంగా చివాట్లు తప్పలేదు.రాజకీయ సంక్షోభం, మార్చిలో జరగనున్న ఎన్నికలు, లాడెన్‌ను చంపించారన్న విమర్శలు, అమెరికాకు తొత్తుగా మారిందనే వ్యతిరేకత, అతివాదుల్లో, ఛాందస వాదుల్లో అసహనం- పాక్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొవడానికి పాక్‌కు కనిపించిన సాకు కాశ్మీర్‌. దేశప్రజల్లో ఉన్న భారత వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ఉన్న ఒకే ఒక అవకాశం. సరిహద్దు కవ్వింపులు అందుకే అంటున్నారు రక్షణ నిపుణులు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు యుద్ధమొక్కటే మార్గంగా తోచింది. ఈ యుద్ధంతో భారత్‌ను అశాంతికి గురిచే యవచ్చునని భావిస్తోంది. గత యుద్ధాలు నేర్పిన పాఠాలతో ఇటు భారత్‌- అటు పాక్‌ అణ్వాయుధాల నిల్వలకోసం పరుగులు పెట్టాయి. ఈమధ్యే మనదేశం అగ్ని-5 అనే అత్యాధునిక బ్యాలెస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్లలో లక్ష్యాల ను సైతం చేధించేలా దాన్ని తయారు చేశారు.

ఫోక్రాన్‌ ప్రయోగం తర్వాత భారత్‌ ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంది.గత యుద్ధాల్లో అస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువే కాని ఈ సారి యుద్ధం వస్తే నష్టం ఊహకు అందదు. కేవలం భారత్‌, పాక్‌ మాత్రమే యుద్ధంలో పాల్గొన్నా, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం అదుపు తప్పి అణు బాంబులు దారిమళ్ళినా కష్టమే అంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్‌ మాత్రం హైదరాబాద్‌ను లక్ష్యం చేసినట్టు కనిపిస్తోంది. రక్షణలో కీలక రంగాలైన డిఆర్‌డిఎల్‌, డిఆర్‌డివోతో పాటు, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ హైదరా బాద్‌లో కొలువుండడం పాక్‌ లక్ష్యానికి కారణం. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులుజరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే బయట పడుతుండడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది. ఇన్నాళ్లు మనదేశానికి పరోక్షంగా మద్దతుఇచ్చిన అమెరికా ఈసారి జోక్యం చేసుకోనంటోంది. నిజానికి యుద్ధం వస్తే భారత్‌ ఎదురు నిలవగలదా? పాక్‌ నక్కజిత్తులకు చైనా ఎత్తులు తోడైతే పరిస్థితి ఏమిటన్నది అసలు సమస్య!

No comments :

Post a Comment