పడగవిప్పిన జాత్యాంహకారం
మధ్యప్రాచ్చంలో నియంతలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను మరవకముందే మరోమారు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. యూదుల జాత్యాహంకారం పడగ విప్పడంతో పాలస్తీనా భూభాగం మరోసారి నెత్తురుతో తడిసింది. గత వారం రోజులుగా అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని గాజా పట్టణంపై వైమానిక దాడులకు దిగడంతో పదుల సంఖ్యలో పిల్లలు, వృద్ధులు, మహిళలు మృతి చెందాల్సి వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్ భూభాగంపై పాలస్తీనీయులు రాకెట్లతో దాడులు చేశారనే సాకుతో ఇజ్రాయెల్ సైన్యం గాజా పట్టణంపై సైన్యంతో విరుచుక పడింది. గత కొెన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనీయుల్ని అడపాదడపా కవ్విస్తున్నప్పటికీ. ఈమధ్య కాలంలో తన జాత్యాంహంకారాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వుతున్నది. ఇజ్రాయెల్ గతంతో తాను ఆక్రమించిన వెస్ట్బ్యాంక్ భూభాగంపై అక్రమ సెటిల్మెంట్ల నిర్మాణం వేగవంతం చేయడంతో అక్కడి పాలస్తీనీయులు ఈ అక్రమ నిర్మాణాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నారు. అయితే అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్న ఇజ్రాయెల్ ఈ ప్రతిఘటనను తన ఆయుధ సంపత్తితో సమర్తవంతంగా తిప్పికొడుతూ గాజా పట్టణాన్ని చుట్టుముట్టి తీవ్ర నిర్భందాలకు గురిచేస్తుంది. ప్రపంచ పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా ఈ రెండు దేశాల మధ్య జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని గత ఐదు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్నే సమర్థిస్తూ పాలస్తీనాపై యుద్ధానికి పురికొల్పుతున్నది. పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్మెంట్లపై విచారణ చేయాలని, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పాలస్తీనీయుల ఆస్తులను కాపాడాలని, పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సెటిలర్ల హింసాత్మక దాడులను నివారించాలనీ, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ కోరింది. 47 మంది సభ్యులు గల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థల్లో, తీర్మానానికి అనుకూలంగా 36 దేశాలు ఓటు వేయగా పది దేశాలు ఓటింగ్లో పాల్గోనలేదు. అమెరికా ఒక్కటే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ తీర్మాణాన్ని బట్టే తెలుస్తోంది అమెరికా ఎవరి వైపు నిలుచున్నదనేది తెలుసుకోవడానికి. మానవ హక్కులను హరించడంలోనూ, దారుణమైన యుద్ధ నేరాలకు పాల్పడడంలోనూ, మానవతా వ్యతిరేక నేరాలు సాగించడంలోనూ తిరుగులేని రికార్డు ఉన్న అమెరికా, అటువంటి నేరాల్లో అమెరికాకు జూనియర్ పార్టనర్గా ఉన్న ఇజ్రాయెల్కు వత్తాసుగా రావడం ఆశ్చర్చకరమేమీ కాదు. ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు నిర్మించడం ఆపేస్తే తప్ప పాలస్తీనా సమస్య పరిష్కారం సాధ్యం కాదని ఒకవైపు ప్రకటించిన ఒబామా, సదరు సెటిల్ మెంట్ల నిర్మాణాన్ని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా లేడని అమెరికా వ్యతిరేక ఓటు ద్వారా స్పష్టం అవుతోంది.
రెండో ప్రపంచ యుద్ధం వరకు గాజా తదితర ప్రాంతాల్లో పాలస్తీనీయులే తమ భూభాగంగా ప్రకటించుకొని అక్కడ నివాసం ఏర్పాటుచేసుకున్న ప్పటికి అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు తమ స్వప్రయోజనాలకోసం జాతివిద్వేషాలు రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతం గత డెభై ఏళ్లుగా యుద్ధాలతో మునిగితేలాల్సి వచ్చింది. ఈ భూభాగంలోనే పాలస్తీనీయులు, యూదులు గతంలో కలిసి నివసిస్తుండేవారు. ఈ ప్రాంతంపైన గ్రీకులు, రోమన్లు ఈజిష్షియన్లు అనేక సార్లు దండయాత్రలు చేసి పాలించారు. ఈ దండయాత్ర కాలంలో యూదుల్ని అక్కడినుంచి వెళ్లగొట్టారు. దాంతో వారు ప్రపంచంలో అన్ని వైపులకి వలస వెళ్ళారు. పాలస్తీనీయుల్ని కూడా వెళ్ళగొట్టిన సందర్భాలున్నాయి. కానీ వాళ్ళు ఆ దాడులను, దండయాత్రలను ప్రతిఘటిస్తూ అన్ని కాలాల్లో ఎక్కువమంది అక్కడే నివసించారు. యూరప్ దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన యూదులు ఆ దేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని అత్యధిక మంది తక్కువ కాలంలోనే ధనవంతులుగా మారారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్ జాత్యాంహకారం శృతిమించడంతో యూరప్లోని యూదుల పరిస్థితి ప్రమాదంలో పడింది. నాజీ సైనికులు యూదుల్ని యూరప్ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. హిట్లర్ అయితే అమానుషంగా లక్షలాది మందిని ఊచకోత కోశాడు. ఇదే సందర్భంలో తమ దేశాల్లో కూడా వచ్చి స్థిరపడిన యూదుల్ని తరిమేసి వారికి చెందిన ఆస్తులను వశపరచుకోవాలని ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్న అమెరికా, ఇంగ్లండ్ దేశాలు ఈ పరిణామాలు కలిసివచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న బ్రిటన్, యూదులు తలదాచుకోవడానికి వారికొక దేశం కావాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాధనలకు ఇతర యూరప్, అమెరికా దేశాలు వంతపాడాయి. ఇట్లా తమ స్వప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అనే దేశాన్ని సృష్టించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల్లోని యూదులపై మారణహోమానికి పాల్పడింది హిట్లర్ నేతృత్వంలోని జర్మనీ. బాధితులు ఐరోపా దేశాలకు చెందిన యూదులు. వారికి అండగా నిలవాల్సింది,వారిని ఆదుకోవాల్సింది కూడా ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలే. కానీ న్యాయం పేరుతో జరిగిన కుట్రలో ఏమాత్రం సంబంధం లేని పాలస్తీనా బలిపశువుగా మారిపోయింది. పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్లు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించాయి. లక్షల మంది పాలస్తీనీయులను వారి ఇళ్ళ నుండి భూముల నుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి ప్రయత్నించడంతో తిరిగి ఘర్షణలు తలెత్తుతున్నాయి. దాదాపు పది లక్షల మంది పక్క దేశాలకి వలస వెళ్ళి అక్కడ శరణార్థులుగా ఇప్పటికీ ఉన్నారు. అప్పటి నుండీ పాలస్తీయులు తమ స్వస్థలానికి తిరిగిరావడానికి ఎదురు చూస్తున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పొరుగున ఉన్న అరబ్ దేశాలన్నీ 1967లో ఇజ్రాయెల్ పైన యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా అండదండలతో ఆరబ్ దేశాల్ని ఆరు రోజుల్లోనే ఓడించి పాలస్తీనా భూభాగాన్ని ఇంకా ఆక్రమించింది. ఈజిప్టు,సిరియా,జోర్డాన్ దేశాల భూభాగాల్ని కూడా ఆక్రమించింది. తర్వాత కాలంలో ఈజిప్టు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్కు మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. తమ నిలువు నీడ కోల్పోయిన పాలస్తీనీయులు ఉత్తరానా లెబనాన్, సిరియాలు, దక్షిణాన ఈజిప్టు,గాజా, తూర్పున వెస్టు బ్యాంకుల్లో తలదాచుకుంటున్నారు. పాలస్తీనీయులకు కనీస అవసరాలు తీరకుండా ఇజ్రాయెల్ అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. తాగునీరు. సాగునీరు. అందకుండా అడ్డుకుంటోంది. పాలస్తీనాలో ప్రధాన నీటి వనరు కుంటలు. సరస్సులే. ఈ నీటి వనరుల వద్దకు పాలస్తీనీయులు రాకుండా ఇజ్రాయెలీ సెటిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నీటి కుంటలు, సరస్సులను టూరిస్టు కేంద్రాలుగా మారుస్తున్నారు. దానితో పాలస్తీనీయుల పొలాల పొలాలు పండడం గగనం అవుతోంది. వారి పొలాలన్నీ బీళ్ళుగా మారిపోతున్నాయి. ఆయుధాలు ధరించిన యూదు తీవ్రవాదులు పాలస్తీనీయులపై దాడులు చేస్తూ వారి ఇండ్ల నుంచి తరిమి కొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వారికి ఇజ్రాయెల్ పోలీసులు, సైన్యం సహాయంగా వస్తున్నారు. వీరి దుర్మార్గాలను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ పరిణామాలని గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి పాలస్తీనీయులకు అండగా నిలిచింది. 1967 యుద్ధానికి ముందున్న సరిహద్దులకి వెనక్కి వెళ్ళాలని తిర్మానం చేసింది. ఆ యుద్ధంలో చేసిన ఆక్రమణలు చట్టవిరుద్ధమని ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్లో కడుతున్న సెటిల్మెంట్లు చట్టవిరుద్ధమని సమితి తీర్మానం ఉన్నాయి. కానీ అమెరికా యూరప్ల అండవలన అవి అమలు కావడం లేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు 1967 సరిహద్దులకి వెళ్ళడానికీ ఒప్పుకోవడం లేదు. పెద్ద గుండాగా తయారయ్యింది. ప్రపంచానికి అమెరికా పోలీసులయితే మధ్యప్రాచ్చానికి (పశ్చిమాసియా) ఇజ్రాయెల్ జూనియర్ పోలీసుగా అవతారం ఎత్తింది. ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని జాతి వివక్ష పాటిసు జాత్యహంకారిగా వ్యవహరిస్తుంది. అమెరికాలో ఏ అధ్యక్షుడైనా పాలస్తీనాకి అనుకూలంగా ఉన్నా త్వరలోనే తన విధానాన్ని మార్చుకునేలా యూదుల వారిపై ఒత్తిడి తెస్తారు. అమెరికాలో ఉన్న యూదుల్ని ఇజ్రాయెల్ ఆర్గనైజ్ చేస్తు , వారు పెద్ద లాబీగా ఏర్పడి అమెరికా విధానాల్ని ప్రభావితం చేస్తారు. అమెరికాలో యూదుల లాబీ అత్యంత శక్తివంతమైనది. వాళ్ళ డబ్బు వారికా శక్తిని ప్రసాధించింది. చాలా పత్రికా సంస్థలు, ఎం.ఎన్.సిలు యూదులవి. గూగుల్ని యూదులు స్థాపించిందే.
ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చింది. సిరియాలో లేని తిరుగుబాట్లను కిరాయి ఇచ్చి నడుపుతున్న అమెరికా, యూరప్లు యాభై యేళ్ళ నుండి సాగుతున్న ఇజ్రాయెల్ వలస పాలననూ, మానవ హక్కుల ఉల్లంఘనూ, పాలస్తీనీయులపై సాగుతున్న దమనకాండనూ అంత చేయడానికి ప్రయత్నించలేదు. తామూ ప్రయత్నించకపోవడమే కాక ఇతరులు చేసిన ప్రయత్నాలను అవి నీరుగారుస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నేతన్యాహూ యుధావిధిగా మానవ హక్కుల సంస్థ తీర్మానంపై విషం కక్కాడు. ''మానవ హక్కుల సంస్థ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి'' అని హుంకరించాడు.
అయితే గతంలో అలీనోద్యమంలో కీలక పాత్రను పోషించిన భారత్ వంటి దేశాల్లో చాలా సందర్భంల్లో మౌనంగా వ్యవహరించించి. గతంలో పాలస్తీనా సమస్యకు త్వరిత గతిన పరిష్కారారం కనుగోనాలని పిలుపు నిచ్చిన మనం ఆ రోజు చేసిన ప్రతినను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాలి. తద్వారా సుదీర్ఘ కాలంగా బాధలు పడుతున్న పాలస్తీనా ప్రజలు శాంతితో, గౌరవంతో తమకంటూ సొంతదైన రాజ్యంలో బతికేందుకు దోహదపడాలి. ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాలు చేసిందేమి లేదు. 2007లో రెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భుభాగంపై దురహంకార ఇజ్రాయెల్ అత్యాధునికి ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది ఆమాయక పౌరులను బలితీసుకుంటే ఇరాన్ తప్ప నోరు మెదిపిన అలీన దేశమే లేదు. 1947లో ఐరాస ఇజ్రాయెల్ను ఏర్పాటు చేసినప్పుడు దానికి కేటాయిచింది దాదాపు 50 శాతం పాలస్తీనా భుభాగం. కాగా పాలస్తీనాకు నేడు వెస్ట్బ్యాంక్, గాజాలు మాత్రమే మిగిలాయి. హమాస్కు
ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబంద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది కానీ హమాస్పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి ఇజ్రాయెల్, అమెరికా గాజాపై దిగ్బంధాన్ని సాగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేస్తూ, ఆహారం,మందులు అందకుండా చేస్తున్నారు.ఈ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలని తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించలేదు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే కొన్ని ఏళ్లలో పాలస్తీనా ప్రాంతమే లేకుండా పోతుంది. యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ మాత్రమే మిగులుతుంది.
సూర్య పత్రిక 25-11-12
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment