No comments
భారతావనికి పచ్చని వడ్డాణంలా, అపార ఖనిజ నిక్షేపా నియంగా విరాజిల్లిన దండకారణ్యం నేడు రణక్షేత్రంగా మారుతోంది. దట్టమైన కీకారణ్యంలో సంప్రదాయ  జీవనం సాగించే గిరిజన సమాజంపై పరచుకున్న విప్లవ మేఘం అరుణారుణ రూపం సంతరించుకుంటోంది. ‘‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’’ పేరిట రాజ్యం తపెట్టిన సాయుధ కార్యక్రమం అక్కడి పచ్చదనాన్ని పొట్టనపెట్టుకునే దిశగానే సాగుతోందంటే అతిశయోక్తి కాదు. బయటకు మావోయిస్టు ఏరివేత క్ష్యంగా కనిపిసున్నా, దాని వెనుక గిరిజన సమాజాన్ని స్థానభ్రంశం చేయడం, అనంతరం అక్కడి అపార ఖనిజ నిక్షేపా వెలికితీతకు మార్గం సుగమం చేయడం, వాటని బహుళజాతి సంస్థకు కట్టబెట్టడం అసు ఉద్దేశం అన్నది నిర్వివాదం. ఈ పోరు ఫలితంగా ఖాళీ అయిన దండకారణ్యంలోని గను తవ్వకాు గుత్తేదారుకు కాసు వర్షం కురిపించవచ్చు. ‘రాయల్టీ రూపేణా ప్రభుత్వాకు కొంతమేర నిధు సమాకూర్చవచ్చు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో చిన్నాభిన్నమయ్యేది గిరిజన సమాజమే. రాజ్యం చేపట్టిన హరిత వేటలో సమిధు గిరిజనులే.
జగిత్యా జైత్రయాత్ర తరువాత వామపక్ష విప్లవోద్యమం గోదావరి నది దాటి సిరొంచ, గడ్చిరోలి మీదుగా బస్తర్‌ ప్రాంతానికి, దండకారణ్యానికి విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా దాని చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒరిస్సా, మహారాష్ట్రాల్లో కార్యకలాపాు నిరాటంకంగా సాగిస్తోంది. 1990లోనే దండకారణ్యంలో నక్సలైట్ల ప్రాబల్యాన్ని నిరోధించడానికి ప్రయత్నాు మొదయ్యాయి. అవన్నీ కేవం గిరిజన సమాజాన్ని తమ వైపు తిప్పుకొని రాజకీయంగా ఎదిగేందుకు కొందరు గిరిజన నేతు చేసిన ప్రయత్నాు మాత్రమే. ఇప్పటి ప్రభుత్వా మాదిరిగా భారీ సంక్పంతో చేసినవి కావు. అందువ్ల గిరిజన సమాజం చెక్కుచెదరలేదు. వామపక్ష విప్లవోద్యమ విస్తృతీ తగ్గలేదు. 1991లో కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రవర్మ బస్తర్‌ ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా జన జాగరణ్‌ అభియాన్‌ అనే సంస్థను ఈ విధంగానే ఏర్పాటు చేశారు. నక్సలైట్ల తీవ్ర ప్రతిఘటనతో ఈ సంస్థ ఎక్కువ కాం మనలేకపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు వామపక్ష విప్లవోద్యమం దండకారణ్యంలో అవిచ్ఛిన్నంగా విస్తరించింది. దండకారణ్యంలోని చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టుకు కీక స్థావరంగా మారిపోయింది. 2005 జూన్‌లో అప్పటి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా ఉన్న మహేంద్రవర్మ మళ్లీ శాంతిసేన పేరిట సల్వాజుడుం అనే సంస్థను ఏర్పాటుచేశారు. వసపాకు వదిలిపోయిన ‘విభజించి...పాలించు’ సిద్ధాంతం అసరాగా ఏర్పడిన సల్వాజుడుం గిరిజనును తెగ పేరిట విడదీసింది.


నక్సలైట్లకు వెన్నుదన్నుగా గొత్తికోయు నిలిస్తే ` వారితో తెగరిత్యా విభేదాున్న రాచకోయతో సల్వాజుడుం ఏర్పాటుచేయడంతో గిరిజన సమాజం చీలికు పేలికలైంది. దాదాపు 40వే మంది సభ్యున్న ఈ సేనలో 10 వే మందికి పైగా సాయుధును ప్రత్యేక పోలీసు అధికారు (ఎన్‌.పి.ఒ) హోదాతో నక్సలైట్లను తుదముట్టించడానికి నియమించారు. మావోయిస్టును ఎదుర్కొనే క్ష్యంతో ప్రారంభమైన సల్వాజుడుం చివరకు ూఠీకు, హత్యకు, అత్యాచారాకు, గృహదహనాకు దారితీసింది. గ్రామకు గ్రామానే దహనం చేశారు. మవోయిస్టు సానుభూతిపరునే పేరిట సామూహిక హత్యాకాండతో దంతెవాడ, కుంట, నారాయణపూర్‌, బస్తర్‌ ప్రాంతాల్లో సల్వాజుడుం కార్యకర్తు ఎన్‌.పి.ఒ ు తెగబడ్డారు.  సల్వాజుడుం ఆగడాతో వెయ్యిమందికి పైగా గిరిజను ప్రాణాు కోల్పోయారు. 644 గ్రామాు జనసంచారానికి దూరమయ్యాయి. దాదాపు 3.5 క్ష మంది నిర్వాసితుయ్యారు. రెండు క్షమంది గిరిజను ఆచూకీ ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కనుగొనలేకపోయింది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర, ఒరిస్సాల్లో సుమారు 60 వే మంది తాత్కాలిక నివాసాు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మరో 70 వే మంది వరకు సల్వాజుడుం ఏర్పాటుచేసిన శిబిరాల్లో తదాచుకుంటున్నారు. నక్సల్స్‌కు వ్యతిరేకంగా ` శాంతికోసం ఏర్పాటైనట్లు ప్రచారం పొందిన ఉద్యమమే గిరిజన సమాజాన్ని ఇంతగా అతలాకుతం చేస్తే ` ‘హరిత వేట’ పేరిట ప్రస్తుతం భద్రతాదళాు జరిపే దమనకాండ ఎక్కడికి దారితీస్తుందో సుభంగానే ఊహించవచ్చు. షెడ్యూల్డ్‌ తెగ చట్టం 1996 ప్రకారం ఆదివాసు గ్రామాకు సంబంధించిన నిర్ణయాన్నీ గ్రామసభ తీర్మానా మేరకే తీసుకోవాలి. ఎటువంటి తీర్మాణాూ లేకుండానే ఆదివాసీ గూడేను పోలీసు బగాు ఆక్రమించేస్తున్నాయి. గిరిజను కనీస అవసరాకు ఉపయోగపడే సంతు, పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాు, ఆరోగ్య కేంద్రాను సాయుధ బగాు ఆక్రమించి తమ కార్యకలాపాకు కేంద్రాుగా మార్చుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఒప్పందాను ఉ్లంఘించడమే అయినా ఖాతరు చేయడంలేదు. అడవుల్లో దాగిన మావోయిస్టుకు ఆహార పదార్ధాు అందకూడదనే ఉద్దేశంతో సంత నిర్వహణను పోలీసు నిషేధించారు. అటవీ సంపద అయిన చింతపండు, సీతాఫం, ఇప్పపువ్వు, తునికాకు, అడ్డాకు, కర్రబోగ్గు తదితరా సేకరణే గిరిజనుకు జీవనోపాధి. తాము సేకరించిన వస్తువును సంతల్లో వస్తుమార్పిడి విధానంతో వ్యాపారుకు అమ్ముకుని అహారధాన్యాు, ఇతర నిత్యావసరాను సమకూర్చుకుంటుంటారు. అటువంటి సంతపై నిషేదం విధించడం ద్వారా గిరిజను ఆహార భద్రపైనే దెబ్బకొట్టేందుకు ప్రభుత్వాు ప్పాడుతున్నాయి. ఈ నిర్ణయం ఆదివాసును ఆకలి మంటల్లోకి నెట్టేస్తోంది.
దండకారణ్యంలో విప్లవోద్యమం వేళ్లూనుకుంటున్న సమయంలో ` దేశీయంగా నూతన ఆర్థిక విధానా అములో భాగంగా పెట్టుబడిదాయి, బహుళజాతి సంస్థకు ద్వారాు తెరవడం మొదలైంది. దండకారణ్యంలోని ఇనుప గను, అబ్రకం, డోమైట్‌, బాక్సైట్‌, సున్నపురాయి. తగరం, యురేనియం మొదలైన 39 రకా ఖనిజాపై బహుళజాతి సంస్థ కన్నుపడిరది. దేశంలో 90శాతం బాక్సైట్‌ ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతాల్లోనే ఉంది. ఈ రాష్ట్రాల్లో సాగుతున్న ఖనిజ తవ్వకాు ఆదివాసు మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాబోయే ఆరేళ్లలో గనుపై ఐదు క్ష కోట్ల రూపాయ పెట్టుబడును విదేశీమారక ద్రవ్యం రూపంలో ఆకర్షించడం, పది క్ష ఉద్యోగా క్పన క్ష్యంగా రూపొందించిన నూతన ఖనిజ విధానం అడవు పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే విశాఖ మన్యంలో జిందాల్‌, అన్‌రాక్‌, రన్‌ ఆల్‌ ఖైమా, ఒరిస్సాలో ఎస్సార్‌, వేదాంత, జిందాల్‌ తదితర సంస్థకు రాష్ట్ర ప్రభుత్వాు గనును ధారదత్తం చేశాయి. ఆదివాసు జీవితాల్లో మెగు నింపేందుకు చేస్తున్న అభివృద్ధిగా ప్రభుత్వాు మభ్యపెడుతున్నాయి. వాస్తవానికి పెట్టుబడిదాయి, బహుళజాతి కంపెనీలే వీటివ్ల లాభపడుతున్నాయి. ఆయా రాష్ట్రా ఆర్థిక పరిపుష్టికి సైతం ఇవి పెద్దగా దోహదపడటం లేదన్నది నిర్వివాదం. ఆర్థిక వెసుబాటుకు ఖనిజ నిక్షేపాపైనే అధికంగా అధారపడుతున్న జార్ఖండ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రా తసరి ఆదాయం ఇతర రాష్ట్రా కంటే తక్కువగా ఉండటం ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఒరిస్సాలో అత్యధికంగా గను తవ్వకం సాగుతున్న కిరండోల్‌, కహండి ప్రాంతాల్లో 60 శాతానికి పైగా ఆదివాసు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. అవకాశా స్వర్గంగా పిలిచే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆపార ఖనిజ నిక్షేపాలే నేటి ఆ రాష్ట్ర అంతర్యుద్ధ పరిస్థితుకు ప్రధాన కారణం. దీని ప్రభావం మావోయిస్టు ప్రాబ్యమున్న సరిహద్దు రాష్ట్రాల్లోనూ ప్రతిఫలిస్తోంది. గిరిజనును సభ్యసమాజానికి దూరంగా అడవుల్లోనే ఉంచేయాని ఎవరూ అనరు. స్వాతంత్య్రానంతరం భారత దేశం సాధించిన అభివృద్ధి ఫలాు అదివాసుకు కనీస స్థాయిలోనైనా అందడం లేదు. షెడ్యూల్‌ కులాు, తెగ వారికోసం ప్రత్యేక ప్రణాళిక నిధు కేటాయించి ఉప ప్రణాళికు అముచేయడంపైనా ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ తదితర 11 రాష్ట్రా ప్రభుత్వాు శ్రద్ధవహించడం లేదు. మావోయిస్టున్నందు వల్లే గిరిజన ప్రాంతాు అభివృద్ధికి నోచుకోవడం లేదని, వారిని ఏరివేస్తే ఆయా ప్రాంతాను ప్రగతిపథంలో నడిపించగమనే అభిప్రాయం పసలేనిది. సాగునీటి ప్రాజెక్టు, జవిద్యుత్‌ పథకాు, గను, పరిశ్రము, అభివృద్ధి పేరిట గిరిజనును అడవినుండి వెళ్లగొడుతున్నారు. పోవరం ప్రాజెక్టు పేరిట ఖమ్మం, గోదావరి జిల్లాల్లో 300 గిరిజన అవాసాు తొగించారు. కొమురం భీం ప్రాజెక్టు పేరిట అదిలాబాద్‌ జిల్లాలో, బాక్సైట్‌ మైనింగ్‌ కోసం విశాఖ, విజయనగరం జిల్లాల్లో, ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ పేరిట అదిలాబాద్‌,కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో అటవీ ప్రాంత వాసు నిరాశ్రయువుతున్నారు. పు పేరిట శ్రీశైం  అడవు, ఏనుగు పేరిట చిత్తూరు, విజయనగరం శ్రీకాకుళం గిరిజనును అడవుకు దూరం చేసే ప్రయత్నాు జరుగుతున్నాయి. గత 6 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల కార్యకలాపాు పూర్తిగా అడుగంటాయి. ఆ సమయంలో అదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్యసౌకర్యాు మెరుగపడలేదని మలేరియా పీడిత పల్లెలే చెబుతున్నాయి.
సంస్కృతిపై దాడి:
 భయోత్పాతం సృష్టించి అడవుల్లో భద్రత లేదనే అభిప్రాయం కల్పించి, గిరిజనును మైదాన ప్రాంతాకు తరలించానే ప్రభుత్వా ప్రయత్నాను గిరిజన సమాజ సంస్కృతీ, సంప్రదాయాపూ దాడిగానే పరిగణించాలి. దేశవ్యాపితంగా విస్తరించిన బహుళ జాతి సంస్ళ వ్ల ఇప్పటికే మైదానప్రాంతాల్లో సంప్రదాయ చేతివృత్తు కనుమరుగైపోయాయి. పల్లెల్లో సైతం తాగునీటిని కొనుగోు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుతం స్వచ్ఛమైన నీరు. భూమి, సహజ వనయి, ఖనిస నిక్షేపాు అడవుల్లోనే మిగిలి ఉన్నాయి. వాటిని కబళించే ఉద్దేశంతో అదివాసు తరలింపునకు సాగుతున్న ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ వ్ల భవిష్యత్తరాకు గిరిజన సమాజం చరిత్ర పాఠ్యాంశాకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నక్సలైట్ల హింసా విధ్వంసాను, వారి రాజకీయ పంథాను ఆమోదించలేం కానీ` ఆ ఉద్యమం నిర్భాగ్యు పాలిట ఆంబనగా మారడమనేది, అంగీకరించక తప్పని వాస్తవం. అభివృద్ధి పేరిట ప్రస్తుతం రాజ్యం చేసే విధ్వంసం నిర్వాసిత ఆదివాసు సమస్యను మరింత జటిం చేస్తుందనడం నిష్ఠుర సత్యం.

No comments :

Post a Comment