ఉసురు తీస్తున్న స్వార్థ రాజకీయాలు

No comments
ఆత్మహత్యలూ పోరాట రూపమేనా?
ఆందోళన కలిగిస్తున్న బలిదానాలు. 
పోరాడి ఒరిగిన తెలంగాణ వారసత్వం. 
కారకులు ఉద్యమ నేతలా, పాలకులా? 
మెడలు వంచాలి తప్ప మరణాలు కాదు! 

తెలంగాణ నినాదమే కీలకమైన నేటి సందర్భంలో ఆత్మబలి దానాలు కొనసాగడం పలువురిని విషాదపరుస్తోంది. ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ తల్లి తన బిడ్డల్ని కోల్పోతు న్నది. బంగారు భవిష్యత్తును వదులుకొని విద్యార్థి, యువత తృణప్రాయంగా తమ ప్రాణాల్ని వదులు కుంటు న్నారు. ప్రాణాల్ని- శత్రువును ఎదిరించే యుద్ధ భూమిలోనే పోరాడుతూ వదలాలి. విలువైన ప్రాణాల్ని చంపుకోవడం వల్ల శత్రువుకు అవకాశమిచ్చినట్లవుతుంది. తెలంగాణ ప్రజల పోరాటం ఈనాటిది కాదు. భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత ఈ ప్రజలది. చరిత్రలో వీరోచిత పోరాట గాథలు కోకొల్లలు. దొరలు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి ప్రజల త్యాగాలు వెల కట్టలేనివి. షేక్‌ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ- భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తికోసం పోరాడి నేలకొరిగారు. అటువంటి వారసత్వం తెలంగాణ ప్రజలది. సందర్భం వేరుకావచ్చు కాని, నిరంతర ప్రవాహంగా సాగుతున్న ఉద్యమాలు తెలంగాణ ప్రజల ఆర్తిని చూపిస్తున్నాయి. 



నేటికి ప్రజల ఆకాంక్షలు తీరలేదు. వనరుల పరాయూకరణలో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతుకీడుస్తున్నారు. ఈరోజు ఉద్యమంలో ఆత్మహత్యలు సాగుతున్నాయంటే కారణం నేటి రాజకీయ నాయకుల వైఖరి, వందల కోట్లు డబ్బులు ముట్టజెప్పి తెలంగాణను అడ్డుకుంటున్న ఆంధ్ర పెత్తందార్లదని స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ఉద్యమం నడుస్తున్నా, బలిదానాలవుతున్నా కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు తమ పదవులను వదలకుండా కూర్చుంటున్నారు. పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చు అనే బలమైన విశ్వాసాన్ని ప్రజలలో కల్పించడం లేదు. 
ప్రపంచ చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాటాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదే. ఒకనాడు బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించిన తెలంగాణ నేల గత కొంత కాలంగా ఆత్మహత్యల నేలగా మారిపోతుంది. ఒకనాడు దొరకు ఎదురుతిరిగి పోరాడిన నేల నేడు నైరాశ్యంతో ఆత్మహత్యలతో నిండిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ పోరాటం జరిగినా అక్కడి ప్రజలు తమ శక్తి వంచన లేకుండా పోరాడి నేలకొరిగారే తప్ప ఎవరూ నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కానరాదు.



కానీ ఒక్క తెలంగాణలోనే అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడాల్సిన యువతీ యువకులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. నాటి వీరోచిత తెలంగాణ నేడు ఆత్మహత్యల తెలంగాణగా ఎందుకు మారింది? నాడు అన్యాయానికి ఎదురు తిరిగిన యువత నేడు ఎందుకు ఆత్మహత్యలను ఆశ్రయిస్తోంది? ఈ ఆత్మహత్యలకు కారకులు ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులదా లేక ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకులదా అనేది ఆలోచించాలి.సామాజిక శాస్త్రవేత్త ఇమైల్‌ దుర్క్‌హైమ్‌- ఆత్మహత్యలు మూడు రకాలుగా జరుగుతాయని చెబుతాడు. మొదటిది - అత్మాభిమానం దెబ్బతినడం వలన, వ్యవస్థ తనకు ఏమీచేయదు అనే ఒక మానసిక స్థితికి లోనై ఆత్మహత్య (ఇగోయిస్టిక్‌ సూసైడ్‌) వైపు మొగ్గుతారని, ఇక రెండోవది అల్ట్రూస్టిక్‌ సూసైడ్‌- అంటే పరహిత బలవన్మరణాలు. నా చావుతోనైనా ఈ పరిస్థితి మారాలని ఒక స్థితికి లోనై చేసుకునే బలవన్మరణాలు. 



మూడవది అనోమియా సూసైడ్స్‌- ఈ రకమైన ఆత్మహత్యలు తనను తానూ ఆత్మ బలిదానం చేసుకోవడమే కాకుండా, తన ఆత్మహత్యలకు కారణమైన వారినికూడా బలితీసుకునే విధంగా ఉంటాయి. నేడు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు రెండో రకానికి చెందిన ఆత్మహత్యలుగా గుర్తించవచ్చు. తమ మరణం ద్వారా నైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరి ఈ ప్రాంతంలో దాదాపు 12 వందల మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవస్థమీద, తన మీద నమ్మకంలేని వ్యక్తులు ఇటువంటి రూపాలను ఎంచుకుంటారు. 
2009 డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలను ఒసారి గమనించించే ఒక ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే అనేక నిజాలు మనకు తెలుస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం 1969లో జరిగిన పోరాటంలో దాదాపు 370 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా, ఏ ఒక్కరూ ఆత్మహత్మకు పాల్పడలేదు. అందరూ పోరాడుతూనే, పోలీసుల కాల్పులకు, దెబ్బలకు, చిత్ర హింసలకు గురై చనిపోయారే తప్ప ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు.



2009 నుండి జరుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న శక్తులు ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకొని వచ్చాయి. 2009 డిసెంర్‌లో తెలంగాణకోసం, హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ నుంచి మినహాయించాలని కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో, ఆయన ఆత్మహత్య చేసుకునైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని ఆసుపత్రిలో ప్రకటించారు. అదే సమయంలో తెరాస ఎమ్మేల్యే హరిష్‌రావు కేసీఆర్‌ను ఆరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుంటే- తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుం టానని పోలీసులను బెదిరించారు. ఇటు వంటి సందర్భంలో తమకు దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులే ప్రభుత్వాల, పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉద్యమాన్ని నడిపించాల్సింది పోయి, ఆత్మహత్మలకు ప్రయత్నించడంతో నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి పోరాట బాట పట్టిన తెలంగాణ యువతీ యువకులూ ఆదే మార్గాన్ని పట్టారు. కేసీఆర్‌, హరీష్‌రావు కేవలం ప్రభుత్వాన్ని, పోలీసులను నిలువరించడానికే ఆత్మహత్య నాటకం ఆడి ఉండవచ్చు. 



కానీ తెలంగాణ యువతీ యువకులు దానిని సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. దీక్షా శిబిరం వద్ద కేసీఆర్‌, హరీష్‌రావ్‌ ఒంటిపై కిరోసిన్‌ నాటకం ఆడిన కొద్దిసేపటికే ఎల్బినగర్‌లో శ్రీకాంత్‌ చారి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ప్రాణత్యాగం చేశాడు. వేణుగోపాల్‌ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంటల్లో మాడిపోయాడు. సువర్ణ శరీరం దివీ అయి మండింది. వరంగల్‌ జిల్లాలో చెరుకు అంజయ్య విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. అదే జిల్లాకు చెందిన జాగోత్‌ సోమ్లా నాయక్‌ చెట్టునుంచి దూకి ఆత్మహత్మకు పాల్ప డ్డాడు. కానిస్టేబుల్‌ కిష్టయ్య తుపాకితో కాల్చుకొని చనిపోయాడు. ఇట్లా ప్రతి జిల్లాలో వందలాది మంది యువతీ యువకులు నైరాశ్యంతో తమ ప్రాణాలను అర్పించారు. దీనికి కారణం ఎవరంటే స్పష్టంగా ఉద్యమ నాయకత్వమే అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్కడా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులు ఇటువంటి పోరాట రూపాలను ప్రజలకు అందించరు. కేవలం ఒక్క తెలంగాణ రాజకీయ నాయకులే ఈ పోరాటరూపానికి దారి చూపారు. 



నిజానికి తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక పోరాట చరిత్ర ఉన్నది. తరతరాలుగా తమ శ్రమనంతా ధారపోసి దున్నుకుంటున్న భూమిపై, పండించిన పంటపై తమకే హక్కు దక్కాలని బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా, వారికి మద్దతుగా ఉన్న నైజాంకు వ్యతిరేకంగా గోండు రాజు రాంజీ మూడు రోజులు రోజులపాటు వీరోచితంగా పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన నేల తెలంగాణది. తన చిన్న సైన్యం బ్రిటిష్‌ వారిని, నైజాంను ఓడించలేదని తెలుసు, అయినా వారికి లొంగదలచుకోలేదు. తన ప్రాణం పోయే వరకూ వీరోచింగా పోరాడాడు. ఇది ఈ ప్రాంత ధిక్కార చరిత్ర. ఏ నేలలో గోండు రాంజీ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాడో అదే నేలలో ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కొమురం భీం 85 సంవత్సరాల తర్వాత పంట కొసం, భూమి కోసం, గోండు సంస్కృతి పరిరక్షణ కోసం- కొత్త పోరాటరూపంతో ముందుకొచ్చాడు. పంట మీద, భూమి మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద- ఈ రాజ్యం మీద ఎవరికి అధికారముంటుందో వాడికే సర్వ హక్కులు కాబట్టి, 



అంతిమంగా ఈ పోరాటం ‘మాగోండు రాజ్యం మాక్కావాలి’ అనే నినాదంతో పన్నెండు గోండు గూడేలను ఏకంచేసి జోడెం ఘాట్‌ కేంద్రంగా బ్రిటిష్‌ వారికి, నైజాంకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం నిర్వహించి వీరమరణం పొందాడు కోమురం భీం. ఇదీ తెలంగాణ ధిక్కారమంటే! అయితే తెలంగాణ, దక్కన్‌ గత వెయ్యి సంవత్సరాలుగా ఈ నేలమీద హక్కు తనదే అని ప్రకటన చేస్తూనే ఉన్నది. ఈ ప్రకటనలో భాగమే, ఈ స్వయం నిర్ణయాధికారంలో భాగమే, ఈ ధికార్క సంప్రదాయంలో భాగమే- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కంటే ముందే 30, 40 సంత్సరాల పాటు అనేక మంది చరిత్రకెక్కని మహాయోధులు పోరాటం చేశారు. 1857లో హైదరాబాద్‌లో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన తుర్రెబాజ్‌ ఖాన్‌, మోల్వీ అల్లావుద్దీన్‌ వంటి యోధులు కనిపిస్తారు. నైజాం నియంతృత్వ పాలనను ఎదిరించి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం స్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఏకమై 1946 నుండి 1951 వరకు వీరోచితంగా పోరాటం నడిపిన చరిత్ర ఈ తెలంగాణది. 



పండించిన పంటను బలిసిన దొర విసునూరు రామచంద్రారెడ్డి దోచుకోవడానికి ప్రయత్నిస్తే, దొర సైన్యాన్ని ఎదిరించి పంటను కాపాడుకున్న చాకలి ఐలమ్మ పోరాట గడ్డ ఈ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో రజాకార్లను ఎదిరించారనే సాకుతో 11 మంది యువకులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంటే రజాకార్లను తన్ని తరిమి ఆ యువకుల ప్రాణాలను కాపాడిన మాదిగ ముత్తమ్మ ధీరత్వం తెలంగాణ. పండించిన పంటను భూస్వామి లాక్కోవడానికి ప్రయత్నిస్తే, పోరాడి ప్రాణమిచ్చిన ముస్లిం యువకుడు బందగీ అమరత్వం గావించిన నేల ఈ తెలంగాణ. దొర పొలంలో వెట్టిచాకిరి చేస్తున్న మహిళలు, తమ పిల్లలకు పాలివ్వడానికి అనుమతికోరితే, పాలు ఉన్నాయోలేవో ఒక పాత్రలో పిండి చూపించమన్న దొరను తన్ని తరిమేసిన గొల్ల సత్తెమ్మ ధిక్కారస్వరం తెలంగాణ. ఇట్లా వేలాది మంది ప్రజలు కుల, మత భేదాలు లేకుండా పోరాడిన రక్తంతో తడిసిన నేల తెలంగాణ. అట్లాంటి వీరోచిత తెలంగాణ గత కొంత కాలంగా ఆత్మహత్మల నిలయంగా మారిపోయింది. 



ఒకనాడు పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు- బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించి దోపిడీ దొరలను తన్ని తరిమేస్తే, నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారు మాత్రం తమ రాజకీయ జిమ్మిక్కులతో తెలంగాణ యువతీ యువకుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ, వారీలో నైరాశ్యాన్ని నింపుతూ ఆత్మహత్యలకు పాల్పడేలా పురికొల్పుతున్నారు. తెలంగాణ వీరగడ్డను నేటి తెలంగాణ నాయకత్వం బొందల గడ్డగా మార్చివేసింది. 2009 నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువతి యువకులు పిట్లల్లా రాలిపోతున్నారు. తెలంగాణ అమరుల ఆత్మఘోషకు కారణం ముమ్మాటికి తెలంగాణ నాయకత్వమే. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాంతంలోని ఉద్యమ సంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా క్రియాశీలంగా ఉండి పోరాటాన్ని నడిపి చూపించారు.



విద్యార్థుల పోరాటాన్ని, నిబద్ధతను చూసిన తెలంగాణ పల్లెలు యూనివర్సిటీ విద్యార్థులనే తమ నాయకత్వంగా భావించి ఉద్యమంలో ముందుకు దూకారు. కానీ విద్యార్థులు ఉద్యమంలో ముందుండి పాల్గొంటే తమ భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదమని గ్రహించిన తెలంగాణ రాజకీయ పాలకవర్గ పార్టీలు జాక్‌ల పేరుతో ఏకమై, ప్రలోభాలు కల్పించి ఉద్యమాన్ని విద్యార్థుల చేతులోంచి లాక్కున్నారు. ఒక నాడు యూనివర్సిటీలకు వచ్చి ప్రమాణాలు చేసిపోయిన రాజకీయనాయకులు క్రమంగా తమ వైపు విద్యార్థులను తిప్పుకునేలా చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఆర్ట్‌‌స కాలేజీలో లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించిన విద్యార్థులే- తరువాత రాజకీయ పార్టీల చుట్టూ ప్రదిక్షణలు చేసే స్థితికి, వారి పిలుపులకు స్పందించే స్థితికి చేరుకున్నారు. 




చైతన్య వంతమైన మేధావులుగా తెలంగాణ పోరాట వారసత్వాన్ని ప్రజలకు వివరించి వారిని పోరాలమార్గాన పట్టించాల్సిన విద్యార్థులు నైరాశ్యానికి గురై ఆత్మహత్మలు చేసుకుంటే, వారిని ఊరేగించి ఇంకా ఆత్మహత్యలు చేసుకునేందుకు పరోక్షంగా కారకులయ్యారు స్వార్ధపర నేతలు. తెలంగాణ ప్రజానీకమంతా తమ ఆశలను విద్యార్థుల మీద వారి పోరాటాల మీద ఉంచుకుంటే, తెలంగాణ విద్యార్థులు మాత్రం పాలక వర్గ రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ పోరాటాన్ని తప్పు దారి పట్టించారు.తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్మలకు రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతనైతే వహిస్తాయో విద్యార్థులు, ఉద్యోగస్థులు కూడా అంతే బాధ్యత వహించాలి. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఈ ప్రాంత విద్యార్ధులు, యువకులు నిరాశతో ఇంకా ఇంకా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే. ఇప్పటికైనా తెలంగాణ ధిక్కార స్వరాన్ని, పోరాట వారసత్వాన్ని యువతీ యువకుల్లో నూరిపోయాలి. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా ఈ ప్రాంత సబ్బండ వర్ణాలు తమకు వారసత్వంగా వచ్చిన పోరాట రూపాన్ని ప్రదర్శించి పాలకుల మెడలు వంచాలి తప్ప మరణం వైపు వెళ్ళకూడదు.

(సూర్య 12-11-13)

No comments :

Post a Comment

ప్రజాస్వామ్యమా షర్మిలను చూసి సిగ్గుపడు.

No comments

మన కల్లముందే పదిమంది మహిళలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చితే మనమైతే ఎంచేస్తాం...కాసేపు బాధ పడతాం,కాసేపు కన్నీరు కారుస్తాం, కల్లముందే జరిగిన మారణహోమాన్ని పదిమందికి కథలుకథలుగా చెప్పి బోరున విలపిస్తాం కావొచ్చు... కాని ఆమె మాత్రం మన అందరికంటే భిన్నంగా స్పందించింది....తన కల్ల ముందే జరిగిన ఘటనకు స్పందనగా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేని సాహాసాన్ని  చేసి చుపుతుంది...అమె ఇరోం చాను షర్మిలా....   



నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ల్ లో  నిలుచున్న వారిపై  అస్సాం  రైఫిల్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పది మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సాయుధ దళ కౄరత్వం  అందరిని కలచివేసింది. ఇరోం షర్మిలా స్థానిక పత్రికలో జర్నలిస్టు. కవయిత్రీ కూడా. కనికరం లేని తీరుతో కలతచెందిన షర్మిలా కటిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఆమరణ దీక్షకు దిగింది. యమపాశంగా మారిన భద్రత దళాల ప్రత్యేక అధికారల చట్టం అంతు చూసేదాకా దీక్ష సాగిస్తానని శపధం చేసింది. తన చావుతోనైనా తన జాతికి పట్టిన పీడనను వొదిలించాలని పట్టుదలతో దీక్ష చేపట్టింది. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు షర్మిలాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏంత బలవంతం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో నాసోగ్యాస్ట్రిక్ ఇన్ ట్యుబ్యెషన్ పద్దతిలో ముక్కుద్వారా ద్రవ పదార్థాలను పంపించడం మొదలు పెట్టారు. షర్మిలా బైల్ తీసుకోవడాంకి నిరాకరించింది. ఆత్మహత్య నేరం కింద జైలు శిక్ష సంవత్సరం మాత్రమే కాని ఏడాది కాగానే జైలు నుంచి విడుదల చెయడం మళ్ళీ అరెస్టు చేయడం.. 12 ఏండ్లుగా మణిపూర్ పోలిసులు అదే పని చేస్తున్నారు. ఇప్పటికే 500 సార్లు కోర్టు, జైలు, హాస్పిటల్ వార్డుకు తిరిగించి. 12 ఏండ్లుగా షర్మిలా నోటిద్వారా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ముక్కుద్వారా పైపుతో ప్లూయిడ్ ఎక్కించడం నిజంగా ఒక హింస. షర్మిలా శరీరం రోజురోజుకు కుషికంచిపోతుంది. అవయవాలు మెళ్ళగా దెబ్బతింటున్నాయి. 38 ఏళ్ళ షర్మిలా బరువు ఇప్పుడు 37 కిలోలు. 2006లో విడుదలైనప్పుడు. షర్మిలా ఢిల్లీ రాజ్ఘడ్ చేరుకోని మహాత్ముడికి మొరపెట్టుకుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష సాగించింది. కేంద్రం వెంటనే అరెస్టు చేసి ఆసుపత్రిలో నిర్భందించింది. తరువాత  ఇంఫాల్ కు తరలించింది.  సంచలన వార్తల గుంపులో కొట్టుకుపోతున్న జాతీయ మీడియాకు షర్మిలా దీక్ష వార్త కాదు. అసలే గుర్తింపుకు నోచుకోని ఈశాన్య రాష్ట్రాలు. పైగా కనీస కవరేజ్ ఇవ్వని మీడియా.  సంవత్సరాలు గడుస్తున్న కదలిక లేని తోలు మందం ప్రభుత్వం. శారీరక బహహీనత, మానసిక సంఘర్షణ చుట్టూ తుపాకులు.  ఐతే హాస్పిటల్ లేదంటే జైల్. కత్తుల వంతేనమీద పయనం. ఆటు కానరానీ పరిష్కారం.  ఐతేనేం ఆమె మానసిక దృడత్వం ముందు ఏ అవంతరాలు నిలువలేదు. ఆమె సంకల్ప బలం ముందు నిరాశ, నిశ్పృహలు వెలవలేదు. నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం. అమెను ముందుకు నడిపించాయి. ఈ నవంబర్ 4వ తారికుతో అమె దీక్ష 12 ఏండ్లు నిండిపోతాయి. పుష్కర కాలంగా అదే సహసం అదే సహనం. 12 ఏండ్లుగా పుస్తకాలు, కవితలే ఆమె నేస్తాలు. ఈ ప్రస్తానంలో ఒక ఇంట్రెస్టింగ్ యాంగ్ల్ షర్మిలా లవ్ స్టోరీ.. షర్మిలా దీక్ష కాలంలోనే ప్రేమలో పడింది. అతని పేరు డెస్మాండో  కొటినో. బ్రిటన్ లో పుట్టిన భారతీయుడు .  మానవ హక్కుల కార్యకర్త. మరి పెండ్లెప్పుడు అని అడిగితే. సైనిక చట్టం రద్దై  , శిక్ష ముగిశాక అని చెప్పేసింది  ఆ వనిత సాహస దీక్షకు ఏన్నో అవార్డులు వచాయి. ఎషియన్ హుమన్ రైట్స్ ఫోక్ స్కూల్ మానవ హక్కుల పురస్కారం 2007 లభించింది. కాని మన ప్రభుత్వం కనికరించలేదు. సెవెన్ సిస్టర్స్ లో ఒకటైన మణిపూర్ సిస్టర్ కన్నీళ్ళను తుడవడానికి చేయి రాలేదు. నామమాత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అన్నా హజారే దీక్షకు, కేజ్రివాల్ ధర్నాలకు విపరితమైన ప్రాచుర్యం కల్పించే మీడియా 12 ఏండ్లుగా కొనసాగిస్తున్న దీక్షకు తగినంత ప్రాచుర్యం కల్పించడం లేదు.  రాజకియ నాయకుల యాత్రలకు రోజులతరబడి కవరేజిలు ఇస్తున్న మన తెలుగు పత్రికలు ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఓ మూల నాలుగు లైన్ల స్థానం కల్పించారు. ఇది మన పత్రికల స్థితి....శ్రీశ్రీ అన్నట్లు మన పత్రికలు "పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు పత్రికలు" అనేది నిజమే అనిపిస్తుంది.  ఇప్పుడు ప్రశ్న ఈ దీక్ష ఇంకెంత కాలం సాగుతున్నదన్నది కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకెన్నాలు ఉలుకూ పలుకూ లేకుండా కుర్చుంటాయన్నదే ప్రశ్న. ఒక మహిళ గాంధీ  మార్గంలో సాగిస్తున్న సత్యాగ్రహం పాలకులను  కదిలించ్లేకపోవడం మహా విశాదం.  ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం.  షర్మిలా హిమాలయమంత ఎత్తున ఎదిగిన ఉద్యమ మూర్తి.  అన్యాయాన్ని ఎదిరించి నిపుస్తున్న వాళ్ళకు కొండంత స్పూర్తి . ఆమె నుండి ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విలువైన పాటాలు ఏన్నో. నలుగురి కోసం బతకడం. నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద  అదే అంతటా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాజి రెండు చేతులెత్తి వందనం చేయాలి.
మన తెలుగు పత్రికలు (ఈనాడు,సాక్షి,ఆంద్రజ్యోతి,) ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఇచ్చిన కవరేజ్


No comments :

Post a Comment

మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ` ఓ విశ్లేషణ

No comments
 పపంచీకరణ నేపథ్యంలో సమాచార సాంకేతిక విప్లవం పరిఢవిల్లింది. ఈ క్రమంలోనే భావజా పతనం కొనసాగింది. పెట్టుబడిదారీ విధానానికి ఎదురులేని పరిస్థితును ప్రసార సాధనాు కల్పించాయి. సోవియట్‌ రష్యా పతనం, జర్మనీ ఏకీకరణ పెట్టుబడిదారీ పంథా విజయపరంపరకు గీటురాళ్లుగా నిలిచాయి. కమ్యూనిజం లేదా మార్క్సిస్టు`లెనినిస్టు పంథా లేదా భావజాలానికి ఇక ఏమాత్రం మనుగడ లేదని క్యాపిటలిస్టు`సామ్రాజ్యవాద సమర్థకు గట్టిగా వాదించడం మొదుపెట్టారు. మాస్‌ మీడియా వారి వాదనకు విపరీతమైన ప్రచారం కల్పించింది. కమ్యూనిస్టు దేశమైన చైనా 1980వ దశకం నాటికే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. కేవం మూడు చిన్న దేశాలైన క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియాు మాత్రమే కమ్యూనిజం జెండాను మోస్తూ వచ్చాయి. క్యాపిటలిస్టు వ్యవస్థ 1990 దశకం చివరి నాటికి శిఖర స్థాయికి చేరుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నతస్థితికి చేరుకున్నప్పుడే అంతర్గత వైరుధ్యాలాతో కుప్పకూుతుందని కార్ల్‌ మార్క్స్‌ పేర్కొని ఉన్నాడు. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మార్క్స్‌ సూత్రీకరణకు అద్దం పడుతోంది. ఈ సమాంతర చరిత్రలో మావోయిస్టు ఉద్యమాన్ని విశ్లేషించవసిన అవసరం ఎంతైనా ఉంది.

భారతదేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో అనేక సంక్షోభాు తలెత్తాయి. వాటిలో మొదటిది 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలిక. సిపిఐ రివిజనిస్టు పంథాను నిరసిస్తూ పుచ్చపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏర్పడిన చీలిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు)గా అవతరించింది. మార్క్సిస్టు పార్టీలో జరిగిన తీవ్ర భావజా సంఘర్షణ 1967 నాటికి పతాక స్థాయికి చేరుకుంది. చారూ మజుందార్‌, కానూ సన్యాల్‌, తదితయి సాయుధ విప్లవ పోరాటం వైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్‌ లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్స్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అయితే అనతికాంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్‌లో ఉద్యమం నీరుగారిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో బమైన స్థావరాన్ని ఏర్పరుచుకుంది. 1969 శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెంగాణ రాష్ట్రం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలైట్లు క్రియాశీ పాత్రను పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్‌లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) దళితు, వెనుకబడిన తరగతు వారి సహాయంతో బపడిరది. 1970 దశకంలో ఆంధ్ర నక్సలఉద్యమం క్రమంగా విస్తరించింది. మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలో ఉద్యమ కమిటీు ఏర్పాటయ్యాయి. 1975 ఎమర్జెన్సీ కాంలో తొలిసారిగా నక్సల్‌ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్‌కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలో సర్వసాధారణమైపోయింది.
 
ఎమర్జెన్సీ అనంతర కాంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్‌ ఉద్యమం తన వ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది. సాయుధ పోరాట పంథాను వీడి దశ వారీగా ప్రాంతాను కైవసం చేసుకోవాని 1978లో తీర్మానించారు. అటవీ, మారుమూ గ్రామీణ ప్రాంతాను స్వాధీనం చేసుకున్న తర్వాత క్రమంగా పట్టణాు, నగరాను స్వాధీనం చేసుకునేలా వ్యూహం రచించారు. ప్రజాసమీకరణ కోసం రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, రాడికల్‌ యూత్‌ లీగ్‌, రైతు కూలీ సంఘాన్ని స్థాపించారు. సిరిస్లి, జాగిత్యా జైత్రయాత్రు ప్రజాఉద్యమానికి ఉపమానాుగా మిగిలాయి. ఈ ఉద్యమాు జయప్రదం కావడంతో సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ను స్థాపించారు. అలాగే వ్యూహాత్మక పంథానూ మార్చుకున్నారు. ప్రజాసంఘా ఉద్యమ కార్యకలాపా కంటే సాయుధ దళా ఏర్పాటుపైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘా ప్రభావం క్రమంగా క్షీణించింది. రైతు కూలీ సంఘం ఒక్కటే క్రియాశీంగా వ్యవహరించగలిగింది. 1980 దశకంలో పీపుల్స్‌ వార్‌ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాు కూడా ప్రత్యేక బగాను మోహరించి సాయుధ దళా దాడుకు ఆంధ్రలో ఉద్యమం సెట్‌బ్యాక్‌కు గురైంది. ఈ దశలోనే తొలిసారిగా పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు పొరుగున ఉన్న బస్తర్‌ అడవుకు తరలివెళ్లారు. సరిగ్గా రెండు దశాబ్దా అనంతర ఈ బస్తర్‌ అడవులే పీపుల్స్‌ వార్‌కు అభేద్యమైన కోటుగా మారాయి. 1990 దశకంలో అనూహ్యమైన మార్పు వచ్చాయి. 1991లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పై నిషేధం విధించింది. 
 
ఇక్కడ ఆంధ్ర పరిస్థితిని పక్కన పెడదాం. తెంగాణా నుండి తరలిపోయి అప్పటి మధ్యప్రదేశ్‌లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఎర్పాటు చేసుకున్న నక్సలైటు ఉద్యమ నాయకు క్రమంగా స్థానిక పోరాటాతో గిరిజనులో తమ పట్టును పెంచుకున్నారు. ముఖ్యంగా బహుళ జాతి సంస్థు, మైనింగ్‌ కంపెనీు, భారీ విద్యుత్‌, నీటిపారుద ప్రాజెక్టుతో తమ భూమును, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజను ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్‌ దళాు రాజకీయ నాయకత్వం వహించాయి. ఈ స్థానిక ప్రతిఘటను నక్సల్‌ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డాయి. మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌,బీహార్‌ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలో నక్సల్‌ఉద్యమం త్వరితగతిన విస్తరించింది. ఇక్కడి ప్రభుత్వా ఆర్థిక, పారిశ్రామిక, ఖనిజ సంపద విధానాతో ప్రజలో ఏర్పడ్డ పరాయీకరణ భావన నక్సల్‌ ఉద్యమవ్యాప్తికి తోడ్పాటునందించింది.

2004 నాటికి దేశంలోని సాయుధ విప్లవ పార్టీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. బీహార్‌, జార్ఖండ్‌,  తదితర ప్రాంతాలో పట్టుకలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐ`ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ు విలీనమై సెప్టెంబర్‌ 21న సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. అప్పటికే సాయుధ విప్లవ పంథాను సమాజంలోని అట్టడుగు వర్గాతో పాటు బుద్ధిజీవు కూడా బంగా సమర్థిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూంగా పానావ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాు హింసారూపాన్ని సంతరించుకున్నాయి. గుర్‌గావ్‌లో సమ్మె చేస్తున్న కార్మికుపై కేంద్ర పారామిలిటరీ దళాు విచక్షణారహితంగా క్పాుు జరిపి 67 మందిని బలితీసుకున్నాయి. గుజరాత్‌లోనూ కార్మిక వ్యతిరేక చర్యు ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని గత సిపిఎం ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం పేరుతో పేద భూము సేకరణపై దృష్టి సారించింది. టాటా కోసం నందిగ్రామ్‌లో పేద రైతు నుండి భూమును బవంతంగా సేకరించింది. ఇక్కడి పోరాటం సంకుచిత రాజకీయా కారణంగా అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. మరోవైపు ఒరిస్సాలోని గిరిజను పోస్కో, జిందాల్‌ కంపెనీకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. రaజ్జర్‌లో ఒరిస్సా పోలీసు జరిపిన క్పాుల్లో దాదాపు 57 మంది గిరిజను బయ్యారు. మావోయిస్టు పార్టీ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థానిక మద్దతును కూడగట్టుకుంది. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో పెట్రోఫార్మసూటికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికు జరిపిన పోరాటం మావోయిస్టు పార్టీకి మంచి అవకాశాన్ని కల్పించింది. 2008 నవంబరులో బెంగాల్‌ పోలీసుతో పాటు సిపిఎం కార్యకర్తు జరిపిన క్పాుల్లో దాదాపు 30 మంది వరకూ హతమయ్యారు. అలాగే వందలాది గృహాు దహనమయ్యాయి. మహిళ మానప్రాణాు గాలిలో కలిసిపోయాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇక్కడ అవకాశవాద రాజకీయాకు ప్పాడినప్పటికీ మావోయిస్టు పార్టీ ముస్లిం మైనారిటీ పక్షాన నిలిచి పోరాటాన్ని ఉధృతం చేసింది. బెంగాల్‌ ప్రభుత్వం చివరికి తన విధానాన్ని మార్చుకోవడంతో నందిగ్రామ్‌ పోరాటానికి తెరపడిరది. అయితే అడపాదడపా అక్కడ సిపిఎం కార్యకర్తకు, స్థానికుకు మధ్య ఘర్షణు చెరేగుతూనే ఉన్నాయి. నందిగ్రామ్‌ పోరాటం జాతీయ అంశంగా మారితే, లాల్‌గఢ్‌లో జరిగిన సంఘటను అంతర్జాతీయ స్థాయిలో పతాకశీర్షికుగా మారాయి. లాల్‌గఢ్‌లో గిరిజను నుండి భూము సేకరించి అక్కడ మైనింగ్‌ కంపెనీకు ప్రవేశం కల్పించాని బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది కానీ స్థానికు ప్రతిఘటనతో ఈ ప్రక్రియను నెమ్మదిగా చేపట్టాని భావించింది. ఈ తరుణంలోనే ఇక్కడ మావోయిస్టు పక్క రాష్ట్రమైన జార్ఖండ్‌ నుండి వస వచ్చి స్థానికంగా మద్దతును కూడగట్టుకున్నారు. పోలీసు దమనకాండను నిరసిస్తూ చక్రధర్‌ మహతో నేతృత్వంలోని ‘‘పోలీసు అత్యాచార వ్యతిరేక పౌర కమిటీ’’ ప్రజాఉద్యమం నిర్మించింది. ఈ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ పూర్తి తోడ్పాటునందించింది. 2009 ఆగస్టులో కేంద్ర బగా నాయకత్వం బెంగాల్‌ సాయుధ పోలీసు లాల్‌గఢ్‌ గిరిజనుపై నిర్బంధకాండను మొదుపెట్టాయి. మావోయిస్టు ఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుతో పాటు మహిళను సైతం తీవ్ర అత్యాచారాకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తను మావోయిస్టు ముట్టబెట్టడం మొదుపెట్టారు. అక్టోబరులో జార్ఖండ్‌ పోలీసు అధికారి ఫ్రాన్సిస్‌ ఇందూవర్‌ శిరచ్ఛేదనం మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా తఒంపును తీసుకువచ్చింది. కేంద్ర హోం శాఖ సైతం మావోయిస్టు హింసకు వ్యతిరేకంగా ప్రచార సంరంభాన్ని ప్రారంభించింది. ఈ దశలోనే దేశ రాజధాని ఢల్లీిలో మావోయిస్టు పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కోబడ్‌ గాంధీ అరెస్టెయ్యాడు.  గాంధీ అరెస్టు, కోర్టు విచారణ దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. అలాగే హజారీబాగ్‌ పోలీసు జార్ఖండ్‌ మావోయిస్టు ఉద్యమ నాయకుడు   రవిశర్మను, ఆయన సతీమణి అనురాధను అరెస్ట్‌ చేశారు. వాస్తవానికి వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైనా జార్ఖండ్‌లో ఉద్యమ వ్యాప్తి బాధ్యతను భుజాన వేసుకున్నారు.
 
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాు, భావజాం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాు విఫం కావడంతో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. 2009 నుచి  ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 70 వే కేంద్ర రిజర్వు బగాు,రెండు క్షకు పైగా రాష్ట్ర బగాతో దేశంలో గతంలో ఎన్నడూ లేని  విధంగా మవోయిస్టుపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది  మృతి పోలీసు మృతి చెందారు. అయితే కేంద్ర బగాకు కోుకోలేని దెబ్బతగడంతో ఐదు రోజుకే ఈ ఆపరేషన్‌ను ముగించారు. పారామిలిటరీ దళా జవాన్లు వంద సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వ్లెడిరచలేదు. దీనికి తోడు మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బగాపై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి మివైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టు గ్రేహౌండ్స్‌ దళాపై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకున్నారు. అప్పటి నుండి రాష్ట్రంలో పెద్ద సంఘటను జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి వరంగల్‌ జిల్లా వ్వా గ్రామంలో ఎన్‌కౌంటర్‌కు గురి కావడంతో మావోయిస్టు ఆలోచనలో పడ్డారు.  మహారాష్ట్ర, బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాలో అనేక హింసాత్మక సంఘటను జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాుగా ప్రకటించింది. పీపుల్స్‌ ఇనీషియేటివ్‌ పేరిట దేశంలోని మేధావు మాజీ లోక్‌ సభ స్పీకర్‌ రబీ రే నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చు జరపాని వీరు సూచించారు. ఆయుధాు పక్కన పెట్టి చర్చకు రావాని అప్పటి వరకూ కేంద్రం కోరుతూనే ఉంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం మే 11న ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌కు లేఖ రాస్తూ చర్చకు మావోయిస్టును ఒప్పించాని కోరాడు. చర్చకు మావోయిస్టును అగ్నివేశ్‌ ఒప్పించడంతో మే 31న సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి ఆజాద్‌ స్పందించి షరతును, ఆజెండాను ప్రతిపాదించాడు. మేధావు విజ్ఞప్తితో మావోయిస్టు పార్టీ చర్చకు అనువైన వాతావరనాన్ని కల్పించడానికి కృషిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టుతో చర్చకు సిద్దంగా ఉన్నామంటూనే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హతమార్చేందుకు పథకాన్ని రూపక్పన చేసింది. కేంద్ర ఫాసిస్టు గ్రీన్‌హంట్‌లో భాగంగా విప్లవకారునూ, సాధారణ ప్రజను హత్యచేస్తూ పచ్చినెత్తురు తాగుతున్న పాకవర్గాు మరోసారి తమ నరహంతక నగ్న స్వరూపాన్ని నిసిగ్గుగా బట్టబయు చేసుకున్నారు.
 
జులై1 సిసిఐ మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ను ఆయనతోపాటే ప్రయాణిస్తున్న హేమచంద్రపాండే అనే పాత్రికేయుడినీ పట్టుకొని పాశవికంగా హత్యచేశారు. దీంతో మేధావివర్గం ఎంతో కృషిచేసి సానుకూ వాతావరణాన్ని తీసుకురావాన్న ప్రయత్నానికి ఆజాద్‌  హత్యతో బ్రేక్‌ పడిరది. చర్చకు సంబంధించి మావోయిస్టు పార్టీ నుంచి మాట్లాడుతున్న మానిషినే చంపేస్తే శాంతి చర్చకు అవకాశం ఎక్కడని అగ్నివేశ్‌ తన నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేశాడు. ‘‘మావోయిస్టుపై దాడిలో నా రక్తం బొట్టు వరకు చిందించడానికి సిద్ధం’’ అని ప్రకటించిన చిదంబరంకు మావోయిస్టుతో చర్చు జరపాని, శాంతి కోసం దాడు అపాని వుంటుందని ఎవరైనా ఆశించడం హస్యాస్పదంగానే వుంటుంది. . మరోవైపు మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో కేంద్ర బగాు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాను ముమ్మరం చేశాయి. ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజను ప్రాణాు కోల్పోతున్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాకు తరలిపోతున్నారు.  మావోను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. మరో వైపు దేశంలోని మేధావివర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు సాయుధ పోరాటానికి మద్దతు తొపుతున్నది. వాస్తవ పరిస్థితును పరిగణనలోకి తీసుకుంటే (రాజ్యహింస, దోపిడీ), మావోయిస్టు హింసకు అంతగా ప్రాధాన్యం లేదని అరుంధతిరాయ్‌ వంటి మేధావు సమర్థిస్తున్నారు.ప్రజాపునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాు ఏర్పాటు చేయాని సర్వశక్తు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవైపు, రాజ్య గుత్తాధికారాన్ని బంగా చాటాని తహతహలాడుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సమస్యను మరింత జటిం చేస్తున్నాయి. ఈ సమస్యకు ఆచరణీయమైన, తార్కికమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మేధావుపై ఉన్నా రాజ్య అనుకూ, వ్యతిరేక శిబిరా మధ్య చీలిపోయి ఎవరి వాదనను వారు బంగా వినిపిస్తున్నారు.
 

No comments :

Post a Comment

ఇండియన్ ఆర్మీ అసహ్యకరమైన మరో ముఖం

No comments
తెలిసిన మిత్రుడు నాలుగు రోజుల క్రితం నా ఫేస్ బుక్ లో ఓ కామెంట్ పెట్టాడు. ఎప్పుడు పోలీసులను, మిలటరీని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తుంటావు కదా, మరి దీని గురించి ఏమంటావు అంటూ చార్ ధాం వరదల్లో చిక్కుకున్న భక్తులని రక్షించేందుకు మిలటరీ జవానులు వంతెనలా పడుకోని వున్న పోటోను నాకు టాగ్ చేశాడు.

 చార్ ధాం లో మిలటరీ చేస్తున్న సేవల గురించి కూడా త్వరలో ఓ వ్యాసం రాస్తానులే అని రిప్లయి ఇచ్చా. చార్ ధాం లో సైన్యం చేస్తున్న సహాయం అభినందించదగ్గదే. నిజానికి నాకు పోలీసులపై వ్యతిరేకత లేదు, ఉన్నదంత ఈ వ్యవస్థపైనే. గొప్పగా చెప్పబడుతున్న అతి పెద్ద ప్రజస్వామ్యం పైనే నా విమర్శంతా. ఈ వ్యవస్థలో పావులుగా ఉన్న పోలీసులు మానవత్వాన్ని మరిచి, కనీసం మనుషులుగా కూడా ప్రవర్తించకుండా కౄర మృగాలుగా వ్యవహరిస్తున్నారన్నదే నా విమర్శంతా. వివిధ సందర్భాల్లో ప్రజా ఉద్యమాలను ఏంత కర్కషంగా అణచివేస్తున్నారో, అమాయకులను పట్టుకొని ఏంత చిత్రహింసలు పెడుతున్నారో చూస్తున్న నాకు ఈ పోలీసు, మిలటరీలు చేస్తున్న సేవలు పెద్దగా కదిలించలేవేమో!  
మిలటరీ జవానులు చార్ ధాం లో చేస్తున్న సేవల గురించి ఫేస్ బుక్ లో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ గుప్పిస్తున్న సమయంలోనే (సరిగ్గా మిత్రుడు ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టిన రెండు రెండు రోజులకే) హిందూ పేపర్ లో "Night of Horror" అనే వ్యాసం (30-6-13) ప్రచురితమైంది.దేశాన్ని రక్షించాల్సిన సైనికుల చేతిలో 53 మంది మహిళలు (కాశ్మీర్ లోని కునర్ పుష్పోరా గ్రామస్థులు) అత్యాచారానికి గురై న్యాయం కోసం 22 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. గొప్ప ప్రజస్వామ్యం అని చెప్పబడుతున్న దేశంలో, దేశాన్ని రక్షించాల్సిన సైనికులే మృగాలుగా మారి ముక్కు పచ్చలారని 8 ఏండ్ల పసిపిల్లల నుంచి 80 ఏండ్ల పండు ముసలిని కూడా అత్యాచారం చేస్తే వీళ్ళా దేశాన్ని రక్షించేది అనిపిస్తుంది. మూడు రోజుల్లో డెలివరీ కాబోతున్న మహిళను సైతం సైన్యం ముసుగులో ఉన్న మానవ మృగాలు రేప్ చేస్తే అతి కష్టం మీద డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టాల్సి వచ్చింది. ఇంత కర్కషంగా జంతువులు కూడా వ్యవహరించవు. కాని మన ఘనత వహించిన ఇండియన్ ఆర్మీ మాత్రం ఆ ఘాతకానికి ఒడికట్టారు. తన కళ్ళ ముందే ఎనిమిది మంది సైనికులు తన తల్లిని అత్యాచారం చేస్తుంటే చూసిన ఆ పసి హృదయం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఉహించండి. బాధితులను కలవడానికి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఏస్.ఏం. యాసిన్ మిలటరీ చర్య "హింసాత్మక జంతువుల" లా ఉంది అన్నాడంటే కృర మౄగాల దాడి ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచారానికి గురైన బాలకలను పెళ్ళి చేసుకోవడానికి ఏవరు ముందుకు రాక ఇప్పటికి అవివాహితులుగా మిగిలిపోయి, అంగవైకల్యంతో, మానసిక ఒత్తిడికి లోనై, సజీవ శవాలుగా బతుకులను వేలాడ దీస్తున్నారు. ఇది మన ఇండియన్ ఆర్మీ దేశానికి చేస్తున్న ఇంకో రకమైన సేవ. 

సరిగ్గా ఇలాగే మణిపూర్ లో 2004 జులై 11 వ తేదీన తంగియం మణోరమ అనే 32 ఏళ్ళ మహిళను ఇండియన్ ఆర్మీ ఇంటరాగేషన్ పేరుతో ఇంటి నుంచి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేసి, పొత్తి కడుపులో తుపాకితో కాల్చి పొదల్లో పడేశారు. ఈ విషయం తెలిసిన 12 మంది మహిళలు నగ్నంగా అసాం రైఫిల్స్ కార్యాలయం ముందు "Indian army rape us" అని బ్యానర్ తో నిరసన వ్యక్తం చేశారు.

ప్రత్యక అధికారాల చట్టం పేరుతో సైనికులు ఏంత కర్కషత్వంతో వ్యవహరిస్తే మహిళలు ఇలాంటి నిరసన రుపాన్ని ఎంచుకుంటారు? ప్రత్యేక సాయుధ బలగాల చట్టం పేరుతో ఈశాన్య రాష్టాలలో సైన్యం చేస్తున్న కృరత్వానికి నిరసనగా "ఇరోం షర్మిళ" అనే మహిళ గత 14 ఏండ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఆ అధికారాలను రద్ధు చేయకుండా ఇంకొన్ని అధికారాలను కట్టబెట్టెందుకు పావులు కదుపుతుంది.
ఇది మన ప్రజస్వామ్య ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న రక్షణ. కాశ్మీర్ మీడియా సర్వీస్ సర్వే ప్రకారం 1989 నుంధి 2013 మే వరకు ఒక్క కాశ్మీర్ లోనే  సైన్యం చేతిలో 10,058 మంచి మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురయ్యారంటే సైన్యం నీడన మన మహిళలు ఎంత క్షేమంగా ఉన్నరో అర్థమవుతుంది.  

మన రాష్ట్రంలోని వాకపల్లి లో కూడా పోలీసులు చేసిన నిర్వాహకం ఇదే. నక్సలైట్ల పేరుతో సోదాలు నిర్వహిస్తున్న గ్రెహౌండ్స్ వాకపల్లి లోని 9 మంది ఆదివాసి స్త్రీలను తమ కుటుంబ సభ్యుల ముందే అత్యాచారం చేశారు.
                   (వాకపల్లి గిరిజన మహిళలతో తెలుగు రచయితలు, మహిళా సంఘాల నాయకులు )
వాకపల్లి గిరిజన మహిళలు మమ్ముల్ని గ్రెహౌండ్ పోలీసులు అత్యాచారం చేశారని ఎమ్మార్వో మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా ఎవరు న్యాయం చేయలేదు. వాకపల్లి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఆ మహిళలు పాదయాత్ర చేసి, మాపై అత్యాచారం చేసిన మానవ మృగాలను శిక్షించాలని ఆందోళన నిర్వహించినా ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు.       

"ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే అమె జ్ఞాపకార్థం భారత దేశం మొత్తం దాదాపు 15 రోజులు వెలుగుతున్న కొవ్వొత్తులతో నిండిపోయిందే! మరి మాకు న్యాయం జరగాలని ఒక్క క్రొవ్వొతైనా వెలిగించరా" అని పుష్పోరా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు వారికి ఏమని సమాధానం చెబుదాం. వారికి అండగా నిలుద్దామా లేక మౌనంగా ఉందామా? 

No comments :

Post a Comment

కీలక దశలో ‘పోస్కో

No comments

పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ జగత్‌సింగ్‌పూర్‌ గ్రామస్థులు నిరవధిక దీక్షకు పిలుపివ్వడంతో పోస్కో వ్యతిరేక పోరాటం కీలక దశకు చేరుకున్నది. ఒడిషా రాష్ర్టంలోని జగత్‌పూర్‌ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామీణులు గత 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. పోస్కో ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూ సేకరణను అపాలని పొస్కో ప్రతిరోధ్‌ సంఘం సమితి (పిపిఎస్‌ఎస్‌) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామసభ అనుమతి లేనిదే బలవంతపు భూసేకరణ చేయడం చట్టవ్యతిరేకం అని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్‌ 18న తీర్పు చెప్పడంతో గ్రామస్థులకు కొంత అండ దొరికి నట్లయింది. సుప్రీంకోర్టు తీర్పు గ్రామస్థులకు అనుకూలంగా వచ్చినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం 20 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్‌ పూర్‌ గ్రామాలను ఖాళీ చేయించి బహుళజాతి ఉక్కు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.


దాదాపు 4000 ఎకరాల్లోని అటవీభూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైన, అక్కడ ఉన్న తమలపాకు పంటపైనే ధింకియా, గోవింద్‌పూర్‌ ప్రజల జీవనోపాధి ఆధారపడి ఉంది. ఆ అడవులను కంపెనీకి ఇస్తే వారి బతుకు గడవదు. గ్రామాలు వదిలి పట్టణాల్లో అడుక్కుంటూ బతకడమో లేదా ఆకలికి చావడమో వారికి మిగిలింది. దాంతో గ్రామస్థులు ఆ చావేదో తమ గ్రామాల్లోనే చావాలని నిర్ణయించుకుని ప్రభుత్వాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.పిల్లలు, మహిళలు, వృద్ధులు మూడంచెల ప్రతిఘటనా వ్యవస్థను నిర్మించుకున్నారు. మొదటి వరసలో పిల్లలు దాదాపు వందమంది వరకు నేలకు మొఖం ఆనించి పడుకుని ఉండగా వారి వెనుక మహిళలు, వృద్ధులూ మరోక వంద మందికి పైగా రెండు వరసల్లో అదే విధంగా పడుకుని పోలీసులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నారు. 20 ప్లాటూన్ల పోలీసులతో తలపడడానికి వారు సిద్ధమయ్యారు. జిల్లా అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు వినడం లేదు. ప్రభుత్వాల మాయ మాటలకు లొంగడమంటే తమ జీవనోపాధిని పోగొట్టుకోవడమని వారికి అర్థమయ్యింది.



2005లో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో బహుళజాతి కంపెనీ ఉక్కుఫ్యాక్టరీ నిర్మించ డానికి ఒడిషా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్‌ డాలర్ల (రూ. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో భారత్‌కు వస్తుంది. మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీ నుంచి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌పూర్‌ జిల్లాలోని 4000 ఎకరాల అటవీ భూమి కావాలని కోరింది. రాష్ర్ట ప్రభుత్వం నయానో భయానో ఇప్పటికే 1800 ఎకరాల భూమికి సేకరించింది. ఇంకా ధింకియా, గోవింద్‌పూర్‌ గ్రామాల్లోని 60 శాతం భూమి కావాలి. కాని ఆ రెండు గ్రామాల ప్రజలు తమ భూముల్ని ఇవ్వడానికి నిరాకరించారు. అయితే పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లడంతో పాటు, పోస్కోకు కావలసిన భూమి అటవీ భూమి కావడంతో భూసేకరణ అటవీ చట్టాలు, పర్యావరణ చట్టాలు ఆటంకంగా మారాయి. దాంతో ఆరు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు నిలిచి పోయాయి. గతంలో అనుమతి నిరాకరించిన పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌ ఈ సంవత్సరం అనుమతి ఇచ్చేశారు. 



‘చట్ట వ్యతిరేకతను క్రమబద్ధీకరించడానికి నేను బద్ధ వ్యతిరేకిని. కానీ అందుకు అంగీకరించవలసి వచ్చింది’ అని అనుమతి ఇచ్చే సందర్భంగా ఆయన చెప్పడాన్ని బట్టి ఆయనపై ప్రధాని, ఇతర మంత్రిత్వ శాఖలనుండి వచ్చిన ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. రూ. 52,000 కోట్ల వ్యయంతో, 5 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో తలపెట్టిన ఈ ఫ్యాక్టరీ భారత పాలక వర్గాలు భారత దేశాన్ని నయా ఉదారవాద ఆర్థిక విధానాల ద్వారా విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నదానికి పరీక్షగా నిలిచింది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ఎన్ని ఆటంకాలు ఎదురైనా, చివరికి ప్రజలపైకి పోలీసుల్ని ఉసిగొల్పి వారి ప్రాణాలు తీసైనాసరే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత పాలకులు చెప్పదలుచుకున్నారు. దాన్ని రుజువు చేసుకోవడానికి వారు ఉరకలు వేస్తున్నారు. నేడు రెండు గ్రామాల ప్రజలపైకి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని ఉసిగొల్పి చోద్యం చూస్తున్నాయి కేంద్ర, రాష్రప్రభుత్వాలు.భారత ప్రభుత్వం అడవులు కాపాడుకోవడం కోసం, అడవులపై ఆధారపడి నివసించే గిరిజనుల హక్కులను కాపాడడం కోసం ఆటవీ హక్కుల చట్టాన్ని ఇటీవలే చేసింది. 



ఆ ప్రకారం అడవి భూముల్ని తాకేహక్కు ఎవరికీలేదు. గిరిజనులకి అడవులపైన అన్నిహక్కులూ ఉంటాయి. గిరిజనుల భూముల్ని గిరిజనులు తప్ప ఎవరూ కొనకూడదు. కాని కేంద్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీల సేవల కోసం తానుచేసిన చట్టాలను తానే ఉల్లంఘించడానికి సిద్ధమైంది. కర్బన వాయువుల విడుదలవలన భూమి వేడిక్కి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగింది. దాన్ని నివారించడానికి అడవుల పెంపకాలను విస్తృతంచేయాల్సి ఉంది. అందుకోసం అంతర్జాతీయ ఒప్పందంపై భారత్‌ సంతకం కూడా చేసింది. అయినప్పటికి బహుళజాతి కంపెనీకి గిరిజనుల భూముల్ని అప్పగించేందుకు అటు హక్కులచట్టం, ఇటు పర్యావరణచట్టాలను ఉల్లంఘించ డానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు సిద్ధమైనాయి.ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, మాజీ హోమ్‌ మంత్రి చిదంబరం, వాణిజ్య మంత్రి ఆనంద్‌ శర్మ, వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌ వంటి మార్కెట్‌ స్వేచ్ఛా సిద్ధాంత పండితులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పర్యావరణ అనుమతిని మంజూరు చేయించారు. వారికి తమకు ఓట్లు వేసి గెలిపించిన భారత ప్రజల ప్రయోజనాల కంటే విదేశీ కంపెనీల ప్రయోజనాలు, రెండంకెల జిడిపి వృద్ధిరేటు- అవే కావాలి. 



భారత ప్రజల జీవనోపాధి గంగలో కలిసినా వారి బాధలేదు. అభివృద్ధి పేరులో ప్రజల నోటివద్ద కూడు లాగివేస్తూ విదేశాలకు బంగారు పళ్ళెంలో పెట్టి అర్పించుకుంటున్నాయి. వేల బిలియన్ల రూపాయల ప్రాజెక్టులతో పాటు వచ్చే కమిషన్లు స్విస్‌ బ్యాంకులకు తరలిపోతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూముల్ని అప్పగించకూడదని పోస్కో బాధిత ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలిపోతే తమకు ఇక జీవనోపాధి ఉండదని బాగానే అర్థమయ్యింది. ఏడు సంవత్సరాలనుండి అలుపెరగకుండా పోరాడు తున్నారు. చివరికి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని దించి ధింకియా గ్రామం ప్రవేశం దగ్గర మొహరించారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో సహా వేలమంది గ్రామస్థులు గ్రామ ప్రవేశం వద్ద ఎర్రటి ఎండలో నేలపైపడుకుని గ్రామంలోకి పోలీసులు రాకుండా అడ్డగించడానికి సిద్ధపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం గ్రామంలో, చుట్టూ నిషేధాజ్ఞలు విధించింది. నలుగురైదుగురి కంటే గుమికూడదని ఆజ్ఞాపించింది. ఎండ ఎంత తీక్షణంగా ఉందంటే ఇద్దరు పోలీసులు స్పృహతప్పి పడిపోయారు. పిల్లల్లో చాలా మంది స్పృహ తప్పారు. 



వారు కోలుకుని మంచినీళ్ళు తాగి దీక్ష కొనసాగించారే తప్ప వెనుదిరగ లేదు. మధ్యాహ్నానికల్లా కలెక్టర్‌ గ్రామ ప్రజల నిరసన చట్ట వ్యతిరేకం అని ప్రకటించాడు. ప్రజలు వెళ్ళిపోవాలనీ లేకుంటే లాఠీ ఛార్జీ, కాల్పులు తప్పవనీ మైకుల్లో పోలీసులు హెచ్చరించారు.ధింకియా, గోవింద్‌పూర్‌ గ్రామల ప్రజల పోరాటాన్ని ఒడిషా రాష్ర్టం, కేంద్ర ప్రభుత్వాలు ‘కొన్ని వర్గాలు పథకం ప్రకారం చేస్తున్న ప్రణాళిక బద్ద నిరసన’ గానూ, కొద్ది మంది సృష్టించిన ‘కేవలం శాంతి భద్రతల సమస్య’ గానూ, ‘భూస్వాధీనానికి ఎదురౌతున్న చిన్న సమస్య’ గానూ చిత్రిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజానికి ప్రజల ప్రయోజనార్థమేనని నమ్మబలుకుతున్నాయి. మోజారిటి ప్రజలు వాస్తవంగా ప్రాజెక్టుకు తమ ఆమోదాన్ని ఎన్నడో తెలిపారనీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. అదే నిజమైతే గ్రామ సభల నుండి ప్రాజెక్టును సమర్థిస్తూ ఒక తీర్మానాన్నయినా ప్రభుత్వాలు రికార్డు చేశాయా? అటవీ హక్కుల చట్టాన్ని ఆ గ్రామ ప్రజలకు ఎందుకు వర్తింప జేయరు? అనే ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలనుంచి సమాధానాలు రావడం లేదు. ప్రభుత్వాలు, కంపెనీ చెబుతున్నట్లు పోస్కో ప్రాజెక్టు వలన వీసమెత్తు ప్రయోజనం కూడా ప్రజలకు కలగదు.



పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ స్వయంగా నియమించిన ఎంక్వైరీ కమిటీ విచారణ జరిపి ‘ప్రాజెక్టు వలన పర్యావరణానికి తీవ్రమైన వినాశకరమైన ప్రభావం పడుతుంది’ అని తేల్చింది. పర్యావరణంపై ఓడిషా రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి రాసిన అంశాలు గ ఆ ఎంక్వైరీలో మైకుల్లో పోలీసులు తేలాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, పోస్కో కంపెనీలు సమగ్రమైనరీతిలో, ఒక పద్ధతిప్రకారం, ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కయి, చట్టాలను ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాయి. పాలకులు స్వయంగా ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చడం కోసం భారతచట్టాలను గేలిచేయడానికి, ప్రజల హక్కుల ను అణచివేయడానికి పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేయడానికీ నిర్ణయించుకున్నాయి. ఈ అబద్ధాలు, మోసాలూ, నయవంచనలూ, దుష్ర్పచారాలూ కేవలం ఒడిషా ప్రభుత్వానికి, పోస్కో కంపెనీలకే పరిమితమైనవి కావు. దేశ వ్యాపితంగా కొన్ని వందల కంపెనీల కోసం కొన్ని లక్షల ఎకరాల భూములను ప్రజలనుండి బలవం తంగా లాక్కొని విదేశీ కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయి ప్రభుత్వాలు. 



అటవీహక్కుల చట్టాన్ని ఉల్లంఘించి, లక్షలాది కుటుంబాలకు చెందిన వ్యవ సాయ భూముల్ని, అటవీ భూముల్ని లాక్కొని అతితక్కువ రేట్లకు విదేశీ, స్వదేశీ ప్రైవేటుకంపెనీలకు ఇచ్చేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో పర్యావరణ శాఖ నిర్ణయాల ను ప్రజాసంఘాలు సవాలు చేస్తుంటే అది తన నేరాలను అంగీకరించడానికి కూడా వెనకాడ్డంలేదు. అయినా తప్పదని పచ్చిగానే చెబుతున్నాయి. పర్యావరణ చట్టాలను తామింకా అర్థం చేసుకుంటూనే ఉన్నామని జైరామ్‌ చెబుతున్నారు. భారత దేశ వనరుల నిర్వహణలో భారతప్రభుత్వం ఎన్ని ఘోరమైన తప్పులు చేస్తున్నదో, ప్రజల సంపదలను ఎంతనీచంగా పరాయి కంపెనీలకు అప్పనంగా అప్పజెపుతు న్నదో పోస్కోవంటి వ్యవహారాలు విప్పి చూపుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రభు త్వాలు ఎంతటి నేరాలకు పాల్పడుతున్నాయో కూడా వివరించి చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వలన అంతిమంగా లబ్ధి పొందేది విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలేతప్ప ప్రజలకు మిగిలేది అకలే అన్న నిజాల్ని సమర్థవం తంగా కప్పిపెడుతున్నాయి. పోస్కో గ్రామస్థులు జరుపుతున్న పోరాటం భూమి కోసం, జానెడు పొట్ట కోసం పడే ఆరాటం మాత్రమే కాదు. ఇది చావు బతుకుల పోరాటం.

No comments :

Post a Comment

ఎరుపెక్కిన అడవికి బాధ్యులెవరు?

1 comment

భారతావనికి పచ్చని వడ్డాణంలా, అపార ఖనిజ నిక్షేపాల నిలయంగా విరాజిల్లిన దండకారణ్యం తాజా చత్తీస్‌గఢ్‌ ఘటనతో మరోసారి ఎరువెక్కింది. ‘సల్వాజుడుం’, ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’ల పేరిట రాజ్యం తలపెట్టిన సాయుధ కార్యక్రమం అక్కడి పచ్చదనాన్ని పొట్టనపెట్టుకునే దిశగా సాగుతోంటే, దానిని ప్రతిఘటిస్తున్న విప్లవోద్యమం ఎదురు దాడులకు దిగుతోంది. ఫలితంగా ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు, ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు.


పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, పోలీసులు హతమౌతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమి కాకపోయినా ఇంత పెద్ద స్థాయిలో ఒక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నక్సల్స్‌ చేతిలో హతమవ్వడాన్ని మాత్రం పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ర్ట పాలకులు మృతుల కుంటుంబాలను ఓదార్చి, ఘటనను ఖండించి, అదనపు బలగాలను పంపుతామని హామీ ఇచ్చి తమ బాధ్యతను నిర్వహించారు. ఒక రాష్ర్టంలోని ఒక పార్టీముఖ్య నాయకత్వమంతా దాదాపుగా తుడుచికుపెట్టుకపో యిన తర్వాతనైనా పాలకవర్గాలు, రాజకీయ పక్షాలు, మేధావులు, సమాజం అంతా దీని విషయం తీవ్రంగా ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావడానికి కారణాలేమిటో, వాటి పరిష్కారాలేమిటో వెతకాలి. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జరుగుతున్నది ఇదే. పాలక వర్గాలు తమ సొంత ప్రజల్నే చంపడానికి లక్షలాది పారా మిలటరి బలగాలను, పోలీసులను పంపి వేటాడి చంపే స్థితి ఎందుకొచ్చిందనేది చర్చించాలి. చత్తీస్‌గఢ్‌ ఘటనకు తమదే బాధ్యత అంటూ మావోయిస్టులు ప్రకటించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సల్వాజుడుం వంటి ముఠాలను ఏర్పాటుచేసి వేలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకే ఈ దాడికి పాల్పడ్డామని మావోయిస్టులు స్పష్టం చేశారు. 



ఆంధ్రరాష్టంలోని జగిత్యాల జైత్రయాత్ర తరువాత 1979లో వామపక్ష విప్లవోద్యమం గోదావరినది దాటి సిరొంచ, గడ్చిరోలి మీదుగా బస్తర్‌ ప్రాంతానికి, దండకారణ్యానికి విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా దాని చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను పెంచుకున్నది. అయితే 1990లోనే దండకారణ్యంలో నక్సలైట్ల ప్రాబల్యాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 1991లో కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రకర్మ (సిపిఐ మాజీనాయకుడు) బస్తర్‌ ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ‘జన జాగరణ్‌ అభియాన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. నక్సలైట్ల తీవ్ర ప్రతిఘటనతో ఈ సంస్థ మనలేకపోయింది. మళ్లీ కొంత కాలానికి చత్తీస్‌గఢ్‌ శాసనసభా నేతగా ఉన్న మహేద్రకర్మ 2005 జూన్‌లో శాంతిసేన పేరిట ‘సల్వాజుడుం’ అనే సంస్థను స్థాపించాడు.



తెగలరీత్యా విభేదాలున్న రాచకోయలు, గుత్తికొయ్యల మధ్య విద్వేషాలను మరింతగా పెంచి మహేద్రకర్మ కొంత విజయం సాధించాడు. నక్సలైట్లకు వెన్నుదన్నుగా గొత్తికోయలు నిలిస్తే వారితో తెగ రీత్యా విభేదాలున్న రాచకోయలు సల్వాజుడుంకు మద్దతు తెలపడంతో గిరిజన సమాజం చీలికలు పేలికలైంది. అప్పటికే గనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వానికి నక్సల్స్‌ అడ్డుతగిలారు. వారిని అడ్డుతొలగించుకోవాలని భావించి చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సల్వాజుడుంకు మద్దతు తెలిపింది. దాదాపు 40 వేల మంది సభ్యులున్న ఈ సేనలో 10 వేల మందికి పైగా సభ్యులకు తుపాకులతో శిక్షణ ఇచ్చింది. నెలకు రూ.1500 జీతంతో దాదాపు నాలుగు వేలమందిని ప్రత్యేక పోలీస్‌ అధికారులుగా (ఎస్పీఒ) నక్సలైట్లను తుదముట్టించడానికి ప్రభుత్వం నియమించింది. మావోయిస్టులను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రారంభమైన సల్వాజుడుం చివరకు లూఠీలకు, హత్యలకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు దారితీసింది. వీరి ఆగడాలతో దాదాపు 700 గ్రామాలు నామరూపం లేకుండా పోయాయి. వందలాది మంది అత్యాచారాలకు గురయ్యారు. వెయ్యి మందికి పైగా ఆదివాసీలు హతులయ్యారు. దాదాపు 3.5 లక్షలమంది నిర్వాసితులయ్యారని, రెండు లక్షలమంది గిరిజనుల ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 



సల్వాజుడుం పేరుతో పిల్లల చేతికి తూపాకులు ఇచ్చారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. గిరిజనుల్ని ఎత్తుకెళ్లి సల్వాజుడుం శిబిరాల్లో పెడుతున్నారని, అక్కడ ఉండటానికి ఇష్టపడకపోతే వారిని మావోయిస్టులుగా చిత్రీకరిస్తూ క్రూరంగా హింస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపించాయి. కొందరు ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం బెంచి తీర్పునిస్తూ, 5వ తరగతి మాత్రమే చదివిన యువకులకు ఆయుధాలిచ్చి, పోలీసులతో సమానమైన అధికారాలు ల్పించడం రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అని రాష్ర్ట ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వెంటనే వారి నుండి ఆయుధాలను వశం చేసుకోవాలని ఆదేశించింది. అయితే చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అధికారికంగా సల్వాజుడుంను రద్దుచేసినప్పటికి ప్రత్యేక పోలీసులు అధికారులుగా నియమించిన వారిని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. చత్తీస్‌గఢ్‌లో రమణ్‌ సింగ్‌ ప్రభుత్వం భారీ నిర్బంధ కాండను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ రెండో దశలో బస్తర్‌ ప్రాంతంలో పోలీసులు, పారామిలిటరీ- చింతల్‌నార్‌ ప్రాంతంలో నక్సలైట్లకు సహాయం చేస్తున్నారనే సాకుతో దాదాపు 300 ఇండ్లనుబూడిదచేసి, ముగ్గురు గ్రామీణులను హత్యచేశారు. 


ఆరుగురు మహిలలపై సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల కనుసన్నలలో మిలటరీ, పోలీసులు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడి, హక్కుల కార్యకర్తలను, మేధావులను నిర్బంధాలకు గురిచే స్తూ, వేలాదిమందిని హతమారుస్తూ, ఊళ్లకు ఊళ్లను తగలబెడుతూ, లక్షలాదిమందిని నిరాశ్రయులను చేస్తుంటే, ఏనాడూ ఆదివాసులకు అండగా నిలబడని రాజకీయపార్టీలు చత్తీస్‌గఢ్‌ ఘటను ఖండిం చడం, మహేద్రకర్మపై సాను భూతి వ్యక్తంచేయడం గమనార్హం. ఇవాళ దేశ వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు కాలుమోపి ఈ దేశ వనరుల్ని దోచుకుపోతుంటే రాజకీయ పార్టీలన్నీ ఆ బహుళజాతి కంపెనీలకు రాయితీలు కల్పిస్తూ వారికి అండగా నిలబడున్నాయి తప్ప, ఆ వనరుల్ని కాపాడేందుకు ముందుకు రావడం లేదు. మన రాష్ర్టంలోనే సాగునీటి ప్రాజెక్టు పేరుతో, జలవిద్యుత్‌ పేరుతో, గనులు, పరిశ్రమల పేరుతో, అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొడుతున్నా అడ్డుకోలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, గోదావరి జిల్లాలో 300 గిరిజన గ్రామాలు, వారి అస్తిత్వాలు, వారి సంస్కృతి నామరూపం లేకుండా పోతున్నాయి. అణిచివేత ప్రక్రియను ఆపకుండా, పోలీసులు, మిలటరీబలగాలతో సమస్యను పరిష్కారించాలని ప్రభుత్వాలు అనుకు న్నంత కాలం చత్తీస్‌గఢ్‌ వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు బాధ్యత పాలకులు, ప్రభుత్వాలే వహించాల్సి ఉంటుంది.

http://www.suryaa.com/opinion/edit-page/article-139826

1 comment :

Post a Comment

మూడు దశాబ్దాల తెలుగుదేశం

No comments
గతమెంతో ఘనం
ఆశ నిరాశల మధ్య వర్తమానం
ఎన్టీఆర్‌ విప్లవాత్మక చర్యలు
చంద్రబాబు సంస్కరణల పాలన
తొమ్మిదేళ్ల అధికార వియోగం
పాదయాత్రతో ఆత్మ విశ్వాసం 
తెలుగుదేశం పార్టీది మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. పుట్టుకతోనే ప్రభంజనాన్ని సృషించిన ఆ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఉత్తాన పత నాలను చవి చూస్తూనే కనీవినీ ఎరుగని అఖండ విజయాలను సాధించింది. అదే స్థాయిలో ఊహిం చని పరాజయాలను, అంతుపట్టని సంక్షోభాలను ఎదుర్కొంది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటవేసి చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. అయితే ఇదంతా గత చరిత్ర గానే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు తిరుగేలేని తెలుగుదేశం పార్టీకి నేడు ఎంత తిరిగిన ఫలితం దక్కడం లేదు. మూడు దశాబ్దాల కాలంలో దాదాపు సగం కాలం అధికారంలో మిగతా సగం ప్రతి పక్షంలో కొన సాగింది. అప్పట్లో ఉన్న రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని గట్టేక్కించేందుకు ఆర్థిక సంస్క రణలు అమలుచేసి విప్లవాత్మక మార్పులకు స్వీకారం చుట్టామని, తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయామని చెప్పుకున్నా ప్రజలు మాత్రం గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంచారు.


అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళుతున్న క్రమంలో కొన్ని పొరపాట్లను చేశామని వాటిని సవరించుకున్నామని పార్టీ అధినేత ఎన్నిసార్లు వివ రించినా ప్రజలు అధికార పగ్గాలకు దూరంగానే ఉంచారు. కానీ ఈ మధ్య కాలం లో చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిచిన పాదయాత్ర పార్టీ బలోపేతానికి ఉపయోగపడిందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని ఈసారి అధికారంలోకి రావడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈమధ్య నిర్వహించిన పాద యాత్రతో ఉత్సాహం మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, వచ్చే ఎన్ని కల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు, గతాన్ని సమీక్షించుకు నేందుకు ఈనెల 27,28 తేదీలో గండిపేటలో మినిమహానాడును నిర్వహించుకో బోతుంది. ఈ సందర్భంలో 30 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.



ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పటినుంచి 1982 వరకు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ వస్తున్నది. చీకటి పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు దేశం మొత్తం కాంగ్రెస్‌ను విసిరి అవతల పారేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. గంపెడాశతో గద్దెనెక్కించిన ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నిరాశా, నిస్పృహలే మిగిల్చింది. మాటిమాటికి ముఖ్యమంత్రులను మారు స్తూ, వారిని అవహేళనచేస్తూ కీలుబొమ్మలుగా ఆడిస్తున్న రోజుల్లో కాంగ్రెస్‌ పాలన పై యావగింపు. ఓట్లేసి గెలిపించిన నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్ప డింది. పరిపాలనను అస్తవ్యస్తంగా మార్చివేస్తూ, సంక్షేమాన్ని గాలికొదిలేసి సీల్డు కవర్‌ ముఖ్యమంత్రులను నియమిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతుంటే ప్రజల్లో నైరాస్యం ఆవరించింది. పాలిత కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్ర హం అలుముకుంది. ఏం చేయాలో తెలియని ఆయోమయం. నిస్సాహయత. ఒక సమర్ధుడైన నాయకుడికోసం ఎదురుచూపు. ఒక బలీయమైన రాజకీయ పార్టీకోసం కలవరింతలు చేస్తున్న కాలంలో 1982 మార్చి 21, మద్రాస్‌లోని టి.నగర్‌లో ఒక ఉదయాన నందమూరి తారకరామారావు తన మనసులోని మాట బయట పెట్టాడు. రాజకీయాల్లోకి రావాలని ఉందని. ప్రజలకు సేవచేయాలనే సత్‌సంకల్పాన్ని ప్రక టించారు.



ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం రాజకీయ రంగంలో ప్రకంపనలు రేపింది. తన మనసులో మాట ప్రకటించిన ఎన్టీఆర్‌ వారంరోజులు తిరక్కుండానే 1982 మార్చి 29న హైదరాబాద్‌లో న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తన రాజకీయ ప్రవేశాన్ని స్పష్టం చేశాడు. స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసి, పార్టీపేరు తెలుగుదేశం అని ప్రకటించాడు. పార్టీని ఏర్పాటుచేయడమే ఆల స్యంగా చైతన్యరథాన్ని ఊరువాడ తిప్పాడు. రాత్రింబవళ్లు, అలుపెరగకుండా ఆరు పదుల వయసులో ఊరువాడ తిరిగి ప్రజల మనసులో స్థానాన్ని సుస్థిరం చేసు కున్నాడు.ఎన్టీఆర్‌‌‌ రాజకీయ ప్రవేశాన్ని మొదట్లో ఆషామాషీ వ్యవహారంగా తీసు కున్న కాంగ్రెస్‌ తమ పార్టీ ముందు ఏపార్టీ నిలువజాలదని, ముఖానికి రంగులేసుకునే వాడివల్ల ఏమౌతుందిలే అని తనకుతానూ సర్థిచెప్పుకుంది. అప్పటి కమ్యూనిస్టులు కూడా ఎన్టీఆర్‌ శక్తిసామార్ధ్యాలపై సందేహాలు వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య సైతం కాంగ్రెస్‌ను ఢీకొని విజయం సాధించడం ఎన్టీఆర్‌‌‌ వల్ల ఏమౌతుందిలే అనే అపనమ్మకంతో ఉన్నారు. కానీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకుల వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ రాష్ట్రాన్ని తెలుగు దేశమనే రాజకీయ సునామి చుట్టుముట్టేసి, 1983 జనవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘనవిజయం సాధించింది. సంప్రదాయకంగా వస్తున్న ప్రమాణస్వీకారోత్సవాన్ని ధిక్కరించి, ప్రజలకే జవాబుదారి అని ఎన్టీఆర్‌ 1983 జన వరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో అశేష ప్రజల సమక్షంలో అధికార పగ్గాలు చేపట్టారు. 



ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో విప్లవాత్మకమైన అనేక మార్పులకు స్వీకారం చుట్టాడు. పటేల్‌, పట్వారి వ్యవస్థను రద్దుచేసి, ప్రజల వద్దకే పరిపాలనను తీసుకురావడానికి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఉన్న తాలూకా వ్యవస్థను రద్దుచేసి వాటిస్థానే మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. సంక్షేమమంటే ఏమిటో ఎరుగని రాష్ట్రాన్ని సంక్షేమ బాట పట్టించాడు. పేద ప్రజ లకు కోసం రెండు రూపాయల కిలో బియ్యం. జనతా వస్త్రాల పంపిణీి, రైతులకు రుణమాఫీ, జోగిని వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్థిలో సమాన వాట, విద్యా ఉద్యో గాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి పథకాల ద్వారా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీయార్‌ సంక్షేమ పథకాల వల్ల ఒక వర్గం ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడో అదే సమయంలో కొన్ని వర్గాలను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. పటేల్‌, పట్వారి వ్యవస్థ రద్దు, రిటైర్‌మెంట్‌ వయసును 55 సంవత్సరాలకు తగ్గించడం వంటి నిర్ణయాల వలన తాత్కాలికంగా కొన్ని వర్గాలకు దూరం కావాల్సి వచ్చింది. 



ఒకవైపు ఎన్టీఆర్‌‌‌ తెలుగువారి మనసుల్లో స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న కాలంలోనే ఎన్టీఆర్‌ వ్యవహార శైలి కొంతమంది నేతలకు ఇబ్బందికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీ అంటే తానేనని, తనతో పుట్టిన పార్టీ తనతోనే అంతమౌతుందనే ధోరణితో ఎన్టీఆర్‌‌‌ వ్యవహరిస్తున్నాడని, పార్టీ నిర్మాణంలో ఎన్టీఆర్‌‌‌కు చేదోడు వాదోడుగా ఉన్న నాదెండ్ల భాస్కరరావ్‌ నేతృత్వంలో తిరుగుబాటు జరగడంలో 1984 ఆగస్టు 16న ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయారు. కలలో సైతం ఆయన ఊహించని పరిణామం ఆయనను ఆశనిపాతంలాతాకింది. అప్పటికే ఎన్టీఆర్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పాలు బాగా పెరుగుతున్న కాలంలో ఎన్టీఆర్‌‌‌ను పదవీచ్యుతిడిని చేసిన తీరే ప్రజలకు నచ్చలేదు. ఇందులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హస్తం ఉందని ప్రజలు బలంగా నమ్మారు. జనం ఆగ్రహించి రోడ్డెక్కారు. అప్పటికే తెలుగుదేశంలో చేరిన ఎన్టీఆర్‌ చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్‌ రెడ్డి, ఉభయ కమ్యూనిస్టు నాయ కులు ఎన్టీఆర్‌‌‌కు అండగా నిలిచి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట మహోద్య మాన్ని నడిపారు.



ఆ ఉద్యమ ఫలితంగా నెలరోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్‌‌‌ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తనకు వ్యతిరేకంగా సొంత ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌తో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని గ్రహించిన ఎన్టీ ఆర్‌ 1984 అక్టోబర్‌లో అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ప్రజాతీర్పును కోరారు. ఇందిరా గాంధీ హత్యానంతరం దేశంలో సానుభూతి పవనాలు బలంగా వీస్తున్న సమయ మది. దేశమంతట జరిగిన ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని నమోదు చేసు కుంది. ప్రతిపక్షాలన్ని మట్టికొట్టుకుపోయాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ లోక్‌సభ స్థానాలను దక్కించుకొని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అదే జోరు కొనసాగించింది. మొత్తం 290 స్థానాలకు పోటీచేసి 202 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. 



1985-89 మధ్య కాలం ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే ఆయన జాతీయ స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేసేందుకు విపక్ష నేతలందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కుడి ఎడమల తేడా లేకుండా అందరిని కలుపుకుపోయి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగాడు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర పోషించడమన్నది ఎన్టీఆర్‌‌‌తోనే ప్రారంభమైంది. అయితే ఈ కాలం లోనే రాష్ర్ట పాలనపై ఎన్టీఆర్‌‌‌ శ్రద్ధ కోల్పోయారు. రాష్ర్టంలో పాలన దాదాపుగా స్థంభించిపోయింది. ప్రజల్లోను ప్రభుత్వం పట్ల విసుగొచ్చేసింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. ఈ నేపథ్యంలో 1989 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినా, అధికారంలోకి రాలేకపోయినా, క్యాడర్‌ మాత్రం చెక్కుచెదరలేదు. ఎన్టీ యార్‌ ఉన్నారన్న ధైర్యం, ధీమా, పార్టీని నమ్ముకునేలా చేసింది.



మరో ఏడాది న్నర కాలంలో ఎన్నికలున్నాయన్న తరుణంలో 1993 ఆగస్టులో ఎన్టీఆర్‌ లక్ష్మిపార్వతిని వివాహం చేసుకున్నారు. 70 ఏండ్ల వయసులో ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయం సంచ లనం సృష్టించింది. లక్ష్మిపార్వతి రాకతో తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్టీకీ ఎన్టీయార్‌కు దూరం పెరగడం మొదలైంది. అప్పటికే చిన్న ల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీలో పాతుకుపోయారు. గ్రామ స్థాయినుంచి పార్టీ కార్యకర్తలతో సత్‌సంబంధాలు పెట్టుకున్నాడు. పార్టీలో అన్నీ తానై వ్యవహ రించే స్థాయికి ఎదిగారు.అప్పటి వరకు ఎన్టీఆర్‌‌‌కు అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు, పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావులు సైతం ఎన్టీఆర్‌‌‌ను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొన్నదనే ప్రచారం జరిగింది. లక్ష్మిపార్వతి కారణంగా ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యులకు మధ్య భేేదాభి ప్రాయలు పొడచూపాయి. అయినప్పటికి రాష్ర్ట వ్యాపితంగా తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన యంత్రాంగం, నమ్మకమైన క్యాడర్‌ ఉండటంలో 1994 డిసెంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖండ విజయాన్ని సాధించి చరిత్రను తిరగరాసింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదాకూడా దక్కలేని దయ నీయస్థితికి చేరుకుంది. లక్షలాదిమంది సమక్షంలో ఎన్టీఆర్‌‌‌ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మధ్యపాన నిషేధం ఫైల్‌పై తొలిసంతకం చేశారు. 



ఎన్టీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పార్టీలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారం లోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. 1995 ఆగస్టు 21, 22 తేదీలలో ప్రజలవద్దకు పాలనంటూ ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతి సమే తంగా ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరడం రాజకీయ మలుపుకు దారితీసింది. లక్ష్మీ పార్వతి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పావులు కదుపుతోందని, ఆమెచేతికి క్రమంగా పార్టీ పగ్గాలు చేరిపోతాయని ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌‌‌పై తిరుగుబాటుచేసి మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను చేర దీసి 1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరో అధ్యా యం మొదలైంది. 



ఎన్టీఆర్‌ లాంటి అపరిమిత జనాదరణ వున్న నేత నుంచి పార్టీ పగ్గాలు చేజిక్కిం చుకున్న చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవం నుంచి బాగానే నెట్టుకొచ్చాడు. అప్పట్లో వున్న రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్థిక సంస్కరణలు తీసు కొచ్చాడు. పాలనలో విప్లవాత్మక మార్పులతో తన ముద్రను వేసేందుకు శ్రమిం చాడు. 1995లో దీవించండి అంటూ ప్రజల్లోకి వచ్చిన చంద్రబాబుకు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 1999లో శాసనసభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయ ఢంకా మోగించారు. 1999 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. 



రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సంస్కరణలన్ని వేగవం తం చేశాడు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, క్రీడలు, మౌళిక సదుపాయాలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్ర సామాజిక శాస్త్రాలు వంటి వాటిని విస్మరించి టూరిజమే అన్నింటికి పరిష్కారం చూపుతుందని వాటిని రద్దుచేశాడు. వ్యవసాయ రంగం దండగా అంటూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడని పించుకు న్నారు. అదేకాలంలో రాష్ర్టంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడడంతో రైతులకు కష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపాడు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలన్ని కలిసి చలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిపై కాల్పులు జరిపి ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొనడం జరిగింది. అంగన్‌వాడి కార్యకర్తలు తమ జీతాలుపెంచమని ఆందోళన నిర్వహిస్తే వారిని గుర్రా లతో తొక్కించడం వంటి పాశవిక చర్యలకు పాల్పడం ద్వారా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే కాలంలో 2003 అక్టో్టబర్‌ 1న అలిపిరి దగ్గర చంద్ర బాబుపై నక్సలైట్‌ దాడి జరిగింది. తృటిలో ఆయన బయటపడ్డారు. చంద్రబాబుపై సానుభూతి పెల్లు బికింది. దాన్నీ ఓట్ల రూపంలో మార్చుకుందామన్న చంద్రబాబు తొమ్మిది నెలలకు ముందే సాధారణ ఎన్నికలకు వెళ్లాడు. 2003 డిసెంబర్‌ 14న అసెంబ్లీని రద్దు చేశారు.



అయినప్పటికి 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారు. 2004 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ అనేక గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కార ణంగా తెలంగాణ ప్రాంతంలో పట్టు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రతిపక్షాలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి 2009 ఎన్నికల్లో బరిలోకి దిగినా గెలవలేక పోయింది. అయితే 2009 తర్వాత టీడీపీ పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారయ్యింది. 2004 కంటే 2009లో ఎక్కువ స్థానాలు గెలిచినా పార్టీ నానాటికి దిగజారింది.



తెలంగాణ సమస్య ఒకవైపు జగన్‌ పార్టీ హవా మరోవైపు. ఉప ఎన్నికల్లో పార్టీ వరుస పరాజయాలు, పార్టీని వదిలి వెళ్లిపోతున్న నేతలు, నేతల మధ్య అంతర్గతపోరు ఇలా అనేక సమస్యలతో పీకల్లో తుల్లో ఇరుక్కుపోయింది తెలుగు దేశం పార్టీ. సమస్యలు వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతున్నామని నేతలు చెబుతున్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీవన్మరణ సమస్యగా మారిన 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి పాలవుతే పార్టీ భవిష్యత్తునే ఊహించడమే కష్టంగా ఉంది. అందుకే సర్వశక్తులు వడ్డి 62 ఏళ్ల వయసులో
ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా జనంలో తిరిగాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్‌ చైతన్య రథంపై ఊరువాడ తిరిగి ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి, అధికార పగ్గాల్ని చేజిక్కించుకున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా 2014లో జరిగే ఎన్నికల్లో విజ యం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడా అనేది వేచిచూడాలి.

No comments :

Post a Comment

అప్జల్‌ ఉరి వేస్తున్న ప్రశ్నలు

No comments

ఢిల్లీలో పన్నేండు సంవత్సరాల క్రితం 2001 డిసెంబర్‌ 13న ఐదుగురు సాయుధులు పార్లమెంట్‌పై దాడి జరిపారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు, ఒక పార్లమెంట్‌ ఉద్యోగి చనిపోయారు. కొంతమంది గాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడిన 5 మంది తీవ్రవాదులను పార్లమెంట్‌ భద్రతా జావాన్లు కాల్చి చంపారు. ఈ దాడిలో తీవ్రవాదులకు సహకారం అందించాడనే కారణంతో మూడు రోజుల తర్వాత మహమ్మద్‌ అప్జల్‌ గురు అనే కాశ్మీరినీ, ఢిల్లీ ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ.ఆర్‌.జిలానీని, శ్రీనగర్‌ పండ్ల వ్యాపారి షౌకత్‌ను అరెస్టు చేశారు. కింది కోర్టు జిలానీని,షౌకత్‌ను నిర్దోషులని తేల్చడంతో వాళ్లు శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2 సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2002 డిసెంబర్‌లో న్యాయస్థానం అప్జల్‌కు మరణశిక్ష విధించింది. ఆ కేసుపై తరువాత హైకోర్డులోనూ, సుప్రీం కోర్డులోనూ అప్పీలు చేసుకున్నారు. సుప్రీంకోర్డు 2005 ఆగస్టులో ఆ శిక్షను సమర్థించిన అనంతరం  చివరి అవకాశంగా అప్జల్‌ తరపున భార్య 2006 అక్టోబర్‌లో రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును పంపారు. రాష్ట్రపతి 2013 ఫిబ్రవరి 3న ఆ దరాఖాస్తును నిరాకరించడంతో. ఆ తర్వాత ఐదు రోజుల తేడాతో ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు జైల్లో ఉరితీశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి పదవి బాధ్యతలు స్వీకరించాక  అమలులోకి వచ్చిన రెండో ఉరిశిక్ష ఇది. ప్రతిభాపాటిల్‌ తన పదవి కాలంలో తీసుకోని నిర్ణయాన్ని ప్రణబ్‌ముఖర్జీ  అతి తక్కువ కాలంలోనే రెండు దరఖాస్తులను తిరస్కరించడం  బహుషా రికార్డుగా నమోదు చేయోచ్చేమో? అప్జల్‌ ఉరిని రహస్యంగా నిర్వహించడాన్ని తప్పుపడుతూనే దేశంలోని వామక్ష పార్టీలనీ ఉరిశిక్షను పరోక్షంగా సమర్థించాయి. ఈ చట్టబద్ద హత్యకు దేశంలో చాలామంది  ఆనందోహాత్సహాలతోస్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని ప్రచార సాధనాల తెలుస్తోంది. ప్రతి నేరానికి ఉరిశిక్షే పరిష్కారం అని భావిస్తున్న ప్రజలనుంచి బహుషా మనం ఇంతకంటే వేరే స్పందనను ఆశించలేము. పాలక వర్గాలు ప్రజలనుంచి ఆశిస్తున్నది కూడా ఇదే.

నిజానికి స్వతంత్య్ర భారతదేశంలో ఉరిశిక్షలు కొత్తేమి కాదు. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ఉరిశిక్షలను అమలుచేయడం కూడా కొత్త కాదు, గతంలో ఇదే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఇక్కడ గతంలో అమలు చేసిన ఉరిశిక్షకు నేడు కసబ్‌, అప్జల్‌ గురి ఉరిశిక్షలను అమలు చేసిన విధానంలో తేడా ఉంది. 24 ఏళ్ల క్రితం ఇదే జైల్లో మాజీ ప్రధాని ఇందిరాను హత్య చేసిన నేరస్తులను నాటి ప్రభుత్వం 1989 జనవరి 6న తీహార్‌ జైల్లో ఉరితీశారు. ఒక దశాబ్దం పాటు అతలాకుతం చేసిన ఉగ్రవాద కోరల్లోంచి పంజాబ్‌ అప్పటికింకా పూర్తిగా బయటపడలేదు అయినా భారత్‌ ప్రజాస్వామ్యం పట్ల అకుంఠిత విశ్వాసాన్ని కనబరిచింది. ఇందిర హంతకులకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన విషయాన్ని రాజీవ్‌ ప్రభుత్వమేమీ దాచి పెట్టలేదు. క్షమాభిక్ష తిరస్కృతిపై ఆ ఇద్దరూ నేరస్తులు సుప్రీం కోర్టుకెళ్లారు. కోర్డు వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తరువాతే వారి ఉరిశిక్ష తేదీని ప్రకటించారు. ఆ విషయాన్ని ముందుగానే వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జైలులోనే కడసారిగి కుటుంబ సభ్యులు కలుసుకొని తుది వీడ్కోలు పలికారు. ఆ విషయాలన్నీ బహిరంగంగానే జరిగాయి. నాడు నేరస్తులను కోర్టుచేత రుజువుచేయబడిన వారిని ఉరితీసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే నేడు అప్జల్‌ను  ఉరితీసింది. కానీ అప్పుడు పాటించిన కనీసం సంప్రదాయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ పాటించకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. ఉరి తీయడానికి ఎంచుకున్న సమయం కూడా పలు అనుమానాలకు ఆస్కారమిస్తోంది. యుపిఎ ప్రభుత్వం తన మనుగడ కోసమే ఇంత ఆదరాబాదరగా దీనిని అమలులో పెట్టిందనే విమర్శను కూడా ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. 2005లోనే అప్జల్‌ గురు రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించగా ఐదేళ్ల పాటు గమ్మున ఉన్న ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు  హడివిడి చేసిందనేది ఆలోచించాలి. ఇంకోవైపు ఈ ఏడాది అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున తన ప్రత్యర్థి బిజెపి నుంచి విమర్శలను తిప్పికొట్టేందుకే అప్జల్‌ గురును ఇప్పుడు హడావిడిగా ఉరితీసినట్లుంది. ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించే బిజెపి నోర్మూయించేందుకు దీనిని ఒక సాధనంగా ఉపయోగిచుకున్నట్లు ఉంది. 

అయితే అప్జల్‌గురు ఉరితీయడం న్యాయమని చట్టబద్దమని ప్రభుత్వం విశ్వసిస్తే ఆ పని అంత రహస్యంగా జరపాల్సిన అవసరం లేదు. బతికున్నప్పుడు అప్జల్‌ నేరాలు చేశాడు కాబట్టి ప్రభుత్వ ఆధినంలో ఉండటంలో తప్పులేదు. కానీ అతను చనిపోయాక అతని శవంపై ప్రభుత్వానికి అధికారంలేదు. రహస్య నిర్వహన సమర్థతకు సంకేతం అనుకోవడం దురదృష్టకరం. జైల్‌ మాన్యువల్‌ ప్రకారం కూడా గురు కుటుంబానికి మరణ శిక్ష అమలు లేదిని సమయాన్ని తెయజేయడం బాధ్యత. అంతే కాకుండా వ్యక్తి మరణించిన తరువాత మృతదేహానికి జరపాల్సిన అంతిమ సంస్కారాలు కూడా అతని కుటుంబానికి చెందిన మతపరమైన సొంత బాధ్యత. ఈ బాధ్యతను కూడా ప్రభుత్వం తన సొంత వ్యవహారంగా చేయడాన్ని సమర్థనీయం కాదు. మరణశిక్ష నుంచి జీవితఖైదుగా మార్చమని అప్జల్‌ గురు తరపున అతని భార్య కోరితే రాష్ట్రపతి ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవలసిన అధికారం ఆమెకూ, అతనికీ కూడా ఉంది. తిరస్కరించడానికి చూపిన కారణాలను సమీక్షించాలని సుప్రీంకోర్టును అడిగే హక్కు ఉంది. కొందరికి ఈ అవకాశం కల్పించడం మరికొందరికి నిరాకరించడం న్యాయం కాదు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న పాలకులు తను చేసుకున్న చట్టాలను కూడా తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరైనది కాదు. 

అప్జల్‌ గురు అరెస్టు చేసినది మొదలు ఉరిశిక్షను అమలు చేసే వరకు అతని పట్ల ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, కృరంగానే  వ్యవహరించింది. పర్వేజ్‌ బుఖారి అనే ఫ్రిలాన్స్‌ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఎస్పీ దావిందర్‌ సింగ్‌ అనే ఇంటరేషన్‌ అధికారి మాట్లాడుతూ అతని అరెస్టు ఎక్కడా ఏ పుస్తకకంలో కూడా మేము నమోదు చేయలేదని, తన క్యాంపుల్లోనే అప్జల్‌ను చిత్రహింసలు పెట్టినట్లు అతని జననాంగాల్లో పెట్రోల్‌ పోశామని, కరెంట్‌షాకులు ఇచ్చామని అయినా అతనితో ఏమీ చెప్పించలేకపోయానని చెప్పాడు. నాకు హింసించి నేరాలు ఒప్పించడంలో చాలా పేరుంది. నా ఇంటరాగేషన్‌ తరువాత కూడా ఏమీ చెప్పడానికి లేకపోతే అతను ఏమీ చేయనట్టే. అతను నేరస్తుడుకాడని మొత్తం డిపార్ట్‌మెంట్‌ ఒప్పుకుంటుంది అని దావిందర్‌ సింగ్‌ చెప్పాడు. ఒకవైపు అప్జల్‌ను ఇంటరాగేషన్‌ చేసిన అధికారే పత్రికా ముఖంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్జల్‌కు సంబంధించిన వాస్తవాలను చెబుతుంటే ఇంకోవైపు అప్జల్‌ గురు పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయింది అంటూ  పార్లమెంట్‌ తన తీర్పును ప్రకటించింది. అయినా ప్రభుత్వం అతనికి ఉరితీసింది ఇక్కడే ప్రభుత్వం యొక్క నిజాయితిని శంకించాల్సి వస్తోంది రాష్ట్రపతి క్షమాభిక్ష దరాఖాస్తును తిరస్కరించిన సందర్భంలో ప్రభుత్వం అతనిని న్యాయస్థానానికి కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించకుండా ఆగమేఘాలమీద ఉరితీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాసుపాలు చేయడమే అవుతుంది. 

ఇదే సందర్భంలో నేరస్తుల పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించాల్సి ఉంది. లాహోర్‌లోనూ, పైసలాబాద్‌లోనూ వరుస బాంబు పేలుళ్ల కేసులో సరబ్‌ జిత్‌ నేరస్తుడని పాకిస్తాన్‌ న్యాయస్థానాలు నిర్థారించి 1991లోనే మరణశిక్ష  విధించాయి. కానీ ఆ మరణ శిక్ష అమలులోకి రాలేదు. సరబ్‌జిత్‌కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ ప్రభుత్వంతో రాజభారాలు నడుపుతోంది.  దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు (సరబ్‌జిత్‌, అప్జల్‌) ఇరుదేశాల్లో నేరానికి పాల్పడారని ఇరుదేశాలకు చెందిన అత్యున్నత న్యాయస్థానాలు నిర్ధారించి శిక్షలు అమలు చేయాలని కోరితే, ఒకరి విషయంలో క్షమాభిక్ష పెట్టాలనీ భారత ప్రభుత్వం రాజభారం నడిపి తనూ మాత్రం క్షమా భిక్షను తిరస్కరించడం ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణం కాదా? ఈ రెండు కాసేపు పక్కన పెట్టిన తీవ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడి కాలంలోనే గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి  అధికారం సాక్షిగా దాదాపు మూడు వేల మందిని పొట్టన పెట్టుకొని భారతదేశ లౌకికత్వాన్ని ప్రశ్నిస్తే ఊచకోతకు కారణమైన నరేంద్రమోడిని శిక్షించలేని న్యాయస్థానాన్ని, ప్రభుత్వ ఉదసీనవైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి. 1993లో జరిగిన ముంబై అల్లర్లకు వెయ్యి మంది చనిపోవడానికి ప్రధాన కారణం బాల్‌ఠాక్రే రచనలు, శివసైనికులకు ఆయన చేసిన 

ఉద్భోదలేనని బి.ఎస్‌ కృష్ణ న్యాయ విచారణ కమీషన్‌ నిర్ద్వందంగా ప్రకటించినా ఏనాడు బాల్‌ఠాక్రేపై ఒక్క కేసు నమోదు చేయని పాలక పక్షాన్ని, న్యాయవ్యవస్థను యొక్క పక్షపతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవైపు గుజరాత్‌లో మూడువేల మంది సామన్యుల ఉచకోతకు కారణమైన వ్యక్తిని దేశానికి భావి ప్రధానిగా అభివర్ణిస్తుంటే, ఇంకోవైపు వేలాదిమంది మరణాలను కారకులైన వ్యక్తికి ప్రభుత్వంలోని వ్యక్తులు  సంతాప సందేశాలు పంపడాన్ని ఏవిధంగా చూడాలి. ఇలాంటి చర్యల ద్వారానే ప్రభుత్వమంటే కేవలం మెజారిటి పక్షాలకు చెందిందే అనే అభిప్రాయం సామాన్యుల్లో కలిగే అవకాశం ఉంది. 

అప్జల్‌ గురు గతంలో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉగ్రవాద మూలాల గురించి ఒక కాశ్మీరీగా తన విశ్లేషన చేశాడు. ఆయన ఇంటర్వ్యూలోని భావాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునుంటే కొంతవరకైన ఉగ్రవాద దాడులను అరికట్టగలిగేది. అప్జల్‌ ఆ ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అరికట్టే పేరుతో తన భద్రతా దళాల ద్వారా పాల్పడుతుందని తెలిపాడు. రాజ్య ఉగ్రవాదం గురించి, ముఖ్యంగా ఎస్టీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) వాళ్లు చేస్తున్న ఆరాచకాల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ రాజ్య ఉగ్రవాదమే నాలాంటి వాళ్లను ప్రతిరోజు తయారు చేస్తోందని నిజాయితిగా ఒప్పుకున్నాడు. అమాయకులైన టీనేజీ విద్యార్థులను ప్రజా భద్రతా చట్టం లాంటి క్రూర చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో పడేస్తోందని, ఈ రాజ్య ఉగ్రవాదం ఉన్నంత కాలం ఇలాంటి దాడులకు ఎవరూ అపలేరని, భారత ప్రభుత్వమే కాశ్మీర్‌ను మినీ ఆప్ఘనిస్తాన్‌లా తయారుచేసిందని విమర్శించాడు. ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితి అచ్చం ఆప్ఘన్‌లోలాగానే ప్రమాదంగా ఉందని, ఈ అగ్ని పర్వతం ఎప్పుడో ఒకప్పుడు పేలుతుందని, ఇది హెచ్చరిక కాదని భారత ప్రజలతో పాటు కాశ్మీర్‌ ప్రజల గురించిన ఆవేదన మాత్రమే, కాశ్మీరీలు ఎప్పుడూ భారతీయులకు వ్యతిరేకం కానే కారు. ప్రభుత్వ విధానాలే కాశ్మీరీ ప్రజలను భారతదేశం నుంచి వేరుచేశాయి. దీనికి పరిష్కారం కాశ్మీర్‌లోనే ఉంది తప్పా పాకిస్థాన్‌లో కాదని తెలిపాడు. ఇంత వివరంగా ఒక కాశ్మీరీ పౌరుడు దేశం ముందు ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యను ఉంచితే పాలకులు మళ్ళీ తన రాజకీయ లబ్ది కోసం సమస్యలను జఠిలం చేస్తూ పోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే పెంచి పోషించినట్లవుతుంది. పాలకులు తమ సమస్యలను పరిష్కరించడంలో చిత్తసుద్దిని ప్రదర్శించుండా సమస్యను ఇంకా క్లిష్టతం చేస్తూ  సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంబమైన అత్యంత భద్రతలో ఉన్న పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాతనైనా సమస్య మూలాలలోకి వెళ్ళి పరిష్కారం కనుగొనాలి. 

నేరానికి పాల్పడిన వారిని ఉరితీస్తే సమస్య పరిష్కారం అవుతోందని పాలకులు, సామాన్యులు భావిస్తున్నారు. పాలకులు కూడా ఇలాంటి క్రూరమైన శిక్షలనే అమలుచేస్తోంది. కానీ కఠినమైన శిక్షల ద్వారా నేరాలు తగ్గినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల అనుభవం కూడా ఇదే చెబుతోంది. నేరస్తుడు అమాయకుల ప్రాణాలు తీసుకున్నాడు కాబట్టి చట్టబద్దంగా రాజ్యమే నేరస్తున్ని క్రూరంగా శిక్షించాలనడం అటవిక న్యాయమై అవుతోంది. నేరానికి శిక్ష మరణమే అని వాదిస్తే నేరస్తుడికి, సభ్య సమాజానికి, చట్టబద్ధ రాజ్యానికి ఏం తేడా వుండదు. ప్రతి నేరానికి ఉరిశిక్ష వేయండి అని అడిగే ఈ దేశ ప్రజలు అభద్రత భావంతో ఎక్కడో తన మానవత్వాన్ని కోల్నోతున్నట్టు అనిపిస్తోంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కకూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుందని మహాత్మగాంధీ గారు మరణశిక్షనుద్దేసించి ఒక సందర్భంలో అన్నారు. గాంధీ విలువలపైనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పాలకులు కనీసం ఆయన మాటలనైనా ఆచరిస్తే బావుండు.

No comments :

Post a Comment

బహుళజాతి నీటి వ్యాపారం

No comments
వేసవిలో రాష్ర్టంలో, దేశంలో మంచినీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకోకపోవటం, వారి నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతున్నది. ప్రపంచంలో అత్యంత వర్షపాతంగల దేశాల్లో భారత దేశం ఒకటి. సాలీనా 1170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. అతితక్కువ వర్షపాతంగల అనతంపురం జిల్లాలోనే 600 మి.మీ ఉంటుంది. అమెరికాలో సాలీనా 200 మి.మీ. వర్షపాతం ఉంది. దీన్ని గమనిస్తే మనకు నీటి వనరులు ఎంత సమృద్ధిగా ఉన్నాయో అర్థమౌతుంది. వర్షపాతంలో 10 శాతం కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాము. దేశంలో ఉన్న అనేక జీవనదులతోపాటు, ఆంధ్రరాష్ర్టంలో గోదావరి, కృష్ణ,ప్రాణహిత, వంశధార, పెన్నా, తుంగభద్ర మొదలైన నదులతో పాటు చెరువులు, బావులు, వాగులు, కుంటలు లక్షల సంఖ్యలో ఉన్నాయి.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు, చెక్‌డ్యాముల ద్వారా నదుల్లో నీటిని నిల్వ చేయగలిగి ఉంటే రాష్ర్టంలో నీటి సమస్య ఉత్పన్నం అయేది కాదు. ఐదు సంవత్సరాలు గడచినా రాష్ట్రంలో పూర్తి అయిన జల యజ్ఞం ప్రాజెక్టుల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఒకప్పుడు చెరువుల ద్వారానే సేద్యపు విస్తీర్ణం పెరిగింది.1896లో చెరువుల క్రింద 4 వేల హెక్టార్లు సాగుకాగా 1906 నాటికి 55వేల, 1936 నాటికి మూడు లక్షల హెక్టార్లకు చెరువుల సేద్యం విస్తరించింది. పాలకులు చెరువులను నిర్లక్ష్యంచేసి భారీ నీటి పారుదల రంగం వైపు మొగ్గుచూపారు. దీనిద్వారా కూడా సాగు, మంచి నీరు అందించలేకపోయారు. 1958లో 48 లక్షల హెక్లార్లు చెరువుల కింద సాగుకాగా, 1979 నాటికి 39, 1990 నాటికి 28 లక్షల హెక్లార్లకు చెరువుల సాగుపడిపోయింది. ప్రస్తుతం రాష్ర్టంలో 79 వేల చెరువులున్నాయి. వీటిద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం మూడున్నర లక్షల ఎకరాలకుమించి సాగుకావటంలేదు. చెరువులను మరమ్మ తులుచేసి వర్షపు నీటిని వాటికి మళ్లించేచర్యలు పాలకులు తీసుకొని ఉంటే ముంపు నివారణతోపాటు గ్రామాల్లో సాగు, మంచి నీటి సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేది. వేసవి నీటి ఎద్దడి తగ్గేది.

సాగునీటికి, మంచినీటికి భూగర్భ జలాలపై ఆధారపడడం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ర్టంలో 22 లక్షల 23 వేల బావులున్నాయి. రాష్ర్టంలోని భూగర్భ జలాల్లో 42 శాతం మాత్రమే ఉపయోగించుకొంటున్నాము. వర్షపు నీటి ఇంకుడుపై భూగర్భ జలాల నీటిమట్టం ఆధారపడి ఉంటుంది. బావుల క్రింద సాగయ్యే భూమి విస్తీర్ణం 10 లక్షల నుండి 26.44 లక్షల హెక్లార్లకు పెరిగింది. ఒక్కో బావి కింద సాగయ్యే సగటు విస్తీర్ణం 1.22 ఎకరాలనుండి 1.19 ఎకరాలకు పడిపోయింది. బావుల నుండి నీటి లభ్యత తగుగ్గతోందని ఇది తెలియజేస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టంలో బావుల సంఖ్య పెరుగుతున్నది. అందువల్ల బావుల సేద్యం పెరిగి భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోతున్నది. భూగర్భ జలాలను 90 శాతం వరకు గ్రామీణ ప్రజలు మంచినీటికి ఉపయోగిస్తున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రతి గ్రామంలో ఇంటిముందు చేతిపంపు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చేతి పంపులు ఉన్న గ్రామాల్లో వేసవిలో కూడా మంచినీటికి ఎద్దడి ఉండదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బావుల నీటిని మంచినీరుగా వాడుతున్నారు. వ్యవసాయ పంటల్లో వస్తున్న మార్నుల వలన వరి తర్వాత మినుము, పెసర స్థానంలో మొక్కజొన్న, జొన్న పంటల్ని గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ పంటల తరుణంలో కాల్వలకు నీరు విడుదల కాకపోవటంతో బోర్లద్వారా నీరు పైరుకు మళ్లించటం వలన గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం పడిపోయి, చేతిపంపుల నుండి నీరు రావడం తగ్గిపోయింది. ఫలితంగా ఈ కాలంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు.

దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై పాలకులు సంతకం చేయడంతో దేశ వనరులన్నీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల కైంకర్యం అవుతున్నాయి. ఇందుకు ప్రపంచబ్యాంక్‌ చోదకశక్తిగా పనిచేస్తున్నది. ప్రకృతి సిద్ధమైన అన్ని వనరులతోపాటు నీటిని కూడా బహుళజాతి సంస్థలు వ్యాపార సరకుగా మార్చాయి. అందుకు అనుగుణమైన విధానాలు అనుసరించేవిధంగా పాలకులపై ప్రపంచబ్యాంక్‌ ఒత్తిడి చేసింది. మంచినీరు, సాగునీరు అందించే బాధ్యత నుండి రాష్ర్ట ప్రభుత్వం తప్పుకోవాలని, అందుకు సాగునీటిరంగంలో సంస్కరణలు చేపట్టా లని, అలాచేస్తేనే సాగర్‌, కృష్ణ డెల్టాల ఆధునికీ కరణకు, చెరువుల మరమత్తులకు అప్పుఇస్తామని ప్రపంచబ్యాంక్‌ చెప్పిన విధంగా, రెగ్యులేటరీ ఆధారిటీ ఏర్పాటుచేసింది. కాల్వలకు ఎంత నీరు విడుదల చేయాలి, నీటి పన్ను ఎంత వసూలుచేయాలి అన్నది ఈ ఆధారటీ నిర్ణయిస్తుంది. దీని అమలుకోసం రైతు సంఘాల ను ఏర్పాటు చేసింది. మీటర్లద్వారా అందే సాగునీటి పరిమాణం ప్రకారం రైతుసంఘాలు నీటితీరువా వసూలు చేస్తాయి. ఇది రైతాం గానికి ఆర్థికంగా పెనుభారంగా తయారౌ తుంది. నీటి పొదుపు పేరుతో- ఉన్న నీటినే అదనపు సాగుకు మళ్లించి అదనపు ఆదాయాన్ని రాబట్టడానికే నీటిమీటర్ల ఏర్పాటు.ఆచరణలో ఇది సాగు నీరు భూస్వాములకు- అన్న రూపం తీసుకుంటుంది. చిన్న, సన్నకారు రైతాంగం సాగుకి దూరంకావాల్సి వస్తుంది. ఈ విధంగా సాగునీటిని వ్యాపార సరకుగా ప్రపంచబ్యాంక్‌ చేయించింది.

సాగునీటికి ముందే మంచినీరు వ్యాపారంగా మారింది. మంచినీటి వ్యాపారం సామ్రాజ్య వాద బహుళజాతి సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూర్చిపెడుతున్నది. నదీ జలాలను, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలు అప్పనంగా వాడుకొంటు న్నాయి. రాజస్థాన్‌ లో కోకాకోలా కంపెనీ 14 పైసలకు వెయ్యిలీటర్ల చొప్పున లక్షల లీటర్ల నీటిని వాడుకొం టున్నది. ఇదే విధంగా అనేక రాష్ట్రాల్లో బహుళజాతి సంస్థలు నీటిని కొల్లగొడుతున్నాయి. మన దేశంలో ‘కిన్‌లే’ బ్రాండ్‌ వాటర్‌ లీటర్‌ ఖర్చు 25 పైసలు. నీటి ఖర్చుతో పాటు బాటిల్‌, బాటిల్స్‌ పెట్టే ప్లాస్టిక్‌ కార్బన్‌తో సహా రూ. 2.50 నుండి రూ. 3.75 కు మించదు. కానీ లీటర్‌ బాటిల్‌ను రూ. 20కి అమ్ముతున్నారు. పన్నులు పోను కంపెనీకి 50 శాతం నికరలాభం వస్తుంది. 2002లో భాత దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగింది. 1999-2004 మధ్య ప్రతి సంవత్సరం 25 శాతం చొప్పున ఈ వ్యాపారం పెరిగింది. భారతదేశంలో నీటిని శుద్ధిచేసి అమ్మేసంస్థలు వెయ్యి ఉన్నాయి. పార్లే బిస్‌లరీ 40 శాతం వ్యాపారాన్ని అక్రమించు కోగా, కోకోకోలాకు చెందిన ‘కిన్‌లే’ బ్రాండు 25 శాతం, పెప్సీకోలాకు చెందిన ఆక్వాఫేనా 10 శాతం వాటాలు పొందగా, మిగతా 25 శాతాన్ని దేశీయ వ్యాపారసంస్థలు పొందుతున్నాయి. ప్రపంచ వ్యాపి తంగా ప్రతి సంవత్సరం రూ. 30 లక్షల కోట్ల నీటి వ్యాపారం జరుగు తున్నది. అత్యధిక ధనిక కార్పొరేట్‌ సంస్థలు ప్రపచంలో ఐదువం దలు ఉంటే, నీటి వ్యాపారం చేసే సంస్థలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. ప్రపంచలో ఐదుశాతం మంది ప్రజలు బాటిల్‌ నీళ్ళను తాగిేత సంవత్సరానికి రూ. 50 లక్షల కోట్ల నీటి వ్యాపారం చేయవ చ్చని మవుదే బార్లే అనే నీటి ఉద్యమ కార్యకర్త బ్లూగోల్డ్‌ పుస్తకంలో తెలియచేసినట్లు ప్రపంచబ్యాంక్‌ వెల్లడించింది. దీన్ని గమనిస్తే నీటి వ్యాపారం ఎంత పెద్దఎత్తున జరుగుతుందో అర్థమౌతుంది.


ప్రజలు సురక్షితమైన నీటిని కోరుకొంటున్నారు. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థపదార్థాలు, కాలుష్య రసాయనాలు ఆ ప్రాంతాల నీటిని కలుషితం చేస్తుండటంతో ఆ నీరు అనారోగ్య కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్‌ బాటిళ్ళ నీటి గురించి బహుళజాతి సంస్థలు చేసే ప్రచారానికి ప్రజలు ఆకర్షితులై, బాటిళ్ళ నీళ్లు ఆరోగ్యకరమైనవిగా భావించి, ఆ నీటికి అలవాటుపడుతున్నారు. మాములు ఫిల్టర్‌ పంపునీళ్ళకన్నా బాటిళ్ళ నీళ్ళే కలుషితమైనవని అనేక పరిశోధనల్లో వెల్లడి అయింది. బాటిళ్ళ నీళ్ళకన్నా, ఫిల్టర్‌ చేతిపంపు నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నారన్న వాస్తవాన్ని బహుళజాతి సంస్థలు మభ్యపరుస్తున్నాయి.నీటిని శుద్ధిచేసుకోవటం మన ప్రజలకు ఎప్పటినుండో తెలుసు. చిల్లగింజ గుజ్జు, పసటికమేసి ఎంతో పరిశుభ్రమైన నీటిని తాగేవారు. నీటివ్యాపారానికి మనదేశం లో ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రపంచబ్యాంక్‌ అనేక నివేదికలు విడుదల చేస్తున్నది. ‘డీప్‌ వెల్స్‌ ప్రూడెవ్‌’ పేరుతో ప్రపంచబ్యాంక్‌ వెలువరించిన నివేదికలో మనదేశంలో భూగర్భ జలాలలభ్యత, వినియోగం, భవిష్యత్తు పరిణామాల గురించి విశ్లేషిం చింది. దేశంలో భూగర్భజలాలను ఎలా వినియోగించుకోవాలో బ్యాంక్‌ శాసించనున్నది. నీటి పొదుపుకోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకులకు సూచనలు పంపింది.60 శాతం వ్యవసాయ అవసరాలను, 85 మంచినీటి అవసరాలను దేశంలో భూగర్భజలాలే తీరుస్తున్నాయి.

ఈ విధంగా భూగర్భజలాల వినియో గాన్ని బ్యాంక్‌ కోరుకోవటంలేదు. అందుకే వినియోగంపై పాలకులపై ఆంక్షలు విధింపచూస్తున్నది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగిస్తే మరో 20సంవత్సరాల్లో ప్రమాదపరిస్థితి ఏర్పడుతుంద ని నివేదికలో పేర్కొంటూ, అలాంటి పరిస్థితిరాకుండా నియంత్రణ కమిషన్‌ ఏర్పాటుచేయాలని చెబుతూనే, దేశంలో రెండుకోట్లదాకా బావులు ఉన్నాయని, వాటిని నియంత్రణా వ్యవస్థలోకి తీసుకొని రావడంకష్టమని, అందువల్ల మంచినీటికి ధర నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. అందుకు అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం రూ.2కే బాటిళ్ళద్వారా మంచినీరు గ్రామాల్లో అందచేసా ్తననిచెప్పడం. దీనిద్వారా నీటివ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. మొత్తం పరిస్థితిని గమనించినపడు మంచినీటి కొరతకు పాలకులే కారణం అన్న విషయం స్పష్టమౌతున్నది. ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాన్ని వెంటనే విరమించు కోవాలి. ఇటువంటి ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రజలు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. దేశంలో బహుళజాతి సంస్థల నీటివ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలి.
5-2-13
Email

No comments :

Post a Comment